Movie News

అకీరా వెనుక అడవి శేష్ ప్లానింగ్

నిన్న ఉన్నట్టుండి ఒక షార్ట్ ఫిలింకి పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సంగీత దర్శకత్వం వహించాడని తెలిసి పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. రైటర్స్ బ్లాక్ అనే చిన్న షార్ట్ ఫిలింకి తను ఇచ్చిన స్కోర్ గురించి అడవి శేష్ ప్రత్యేకంగా ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ అందరినీ చూడమని కోరాడు. వీడియో చాలా చిన్నది. ఒక వర్ధమాన రచయిత ఏం రాయాలో తెలియని ఒక విచిత్రమైన సందిగ్ధంలో ఉన్నప్పుడు దాన్నుంచి ఎలా బయట పడి కలంని విదిలించాడన్న పాయింట్ మీద దర్శకుడు కార్తికేయ యార్లగడ్డ సింపుల్ గా ప్రెజెంట్ చేశారు. విజువల్స్ బాగున్నాయి

ఆహా ఓహో అనుకునేంత గొప్పగా లేదు కానీ మంచి ఐడియాని ఇలా చేయడం వరకు ఓకే అనిపించింది. తెరమీద అకీరాని చూడాలనుకుంటున్న అభిమానులతో తల్లి రేణుక దేశాయ్ ఈ మధ్య వివాదాస్పదంగా సోషల్ మీడియాలో బదులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో అకీరా మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తడం ఎవరూ ఊహించనిది. అయితే అకీరా కెరీర్ కు సంబంధించిన మొత్తం ప్లానింగ్ పవన్ తనకు బాగా ఇష్టులలో ఒకడైన అడవి శేష్ కి అప్పగించినట్టు ఎప్పటి నుంచో టాక్ ఉంది. రేణు కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నారట.

ఒకవేళ అకీరా నిజంగానే హీరోగా డెబ్యూ చేయాలని ఫిక్స్ అయితే మాత్రం ఆ బాధ్యత తిరిగి అడవి శేష్ మీద ఉండబోతోందని వినికిడి. ప్రొడక్షన్ కంపెనీ, దర్శకుడు, కథలు వగైరా మొత్తం తనే చూసుకోవాల్సి రావొచ్చు. దానికి ఎంత టైం పడుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత పవన్ కనక ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సి వస్తే అప్పుడు నటనకు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే అకీరాను అనుకున్న టైం కన్నా ముందే లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. కుర్రాడి వయసిప్పుడు 19 ఏళ్ళు

This post was last modified on April 13, 2023 1:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఒక‌టి జ‌గ‌న్‌కు.. ఒక‌టి ష‌ర్మిల‌కు.. అవినాష్‌కు సున్నా

క‌డ‌ప‌లో అవినాష్ రెడ్డి క‌థ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అత‌ను కోల్పోవాల్సిందేనా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. క‌డ‌ప…

59 mins ago

ఆరంభం టాక్ ఏంటి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడం కష్టం. ట్రైలర్ కట్ తో అది చేసి చూపించిన…

2 hours ago

రూ.10 లక్షలు ఇస్తే ‘నీట్’గా రాసేస్తా !

దేశమంతా ఈ ఆదివారం నీట్ - యూజీ పరీక్షలు జరిగాయి. దేశమంతా 24 లక్షల మంది పరీక్ష రాశారు. గత…

2 hours ago

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !

దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో…

3 hours ago

కామెడీ హీరో అదృష్టం బాగుంది

ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఓపెనింగ్స్ వస్తాయా రావా అనే టెన్షన్ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దానికి…

3 hours ago

కాంగ్రెస్‌లో చేరితే వైఎస్ 100 కోట్లు ఇస్తామ‌న్నారు: ఎర్ర‌బెల్లి

మాజీ మంత్రి, తెలంగాణ నాయ‌కుడు, బీఆర్ఎస్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తాను…

4 hours ago