జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ వేరే హీరోల ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులతో వారికి నిరంతరం ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తారక్ అభిమానుల్లోనే అంతర్గతంగా గొడవలు జరుగుతుండటం గమనార్హం. ఇందుకు ఎన్టీఆర్ నటించిన రెండు పాత సినిమాలు కారణం అవుతున్నాయి.
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండు నడుస్తున్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాలు కూడా కొన్ని ఈ వరుసలో రిలీజయ్యాయి. ఐతే మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈసారి రీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం గట్టిగా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులే లీడ్ తీసుకుని ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇందులో ఒక వర్గం ‘సింహాద్రి’ సినిమా స్పెషల్ షోలకు కొంచెం గట్టిగా ప్లాన్ చేసింది. నెల ముందు నుంచే దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. భారీ రిలీజ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
కానీ తారక్ అభిమానుల్లో ఇంకో వర్గం ‘ఆది’ సినిమా రీ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంది. వాళ్లు కూడా కొంచెం గట్టిగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో రెండు వర్గాల మధ్య పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. తారక్ అభిమానులు ఈ సినిమానే చూడాలంటే ఈ సినిమానే చూడాలి అంటూ పరస్పరం ప్రకటనలు రిలీజ్ చేయడం.. ఆయా షోల ప్రత్యేకత గురించి వివరించడం చేస్తున్నారు.
ఇరు వర్గాల వాళ్లూ ఈ షోలు ఛారిటీ కోసమే అంటున్నారు. ‘సింహాద్రి’ షోలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధ పడుతున్న తారక్ అభిమానులను ఆదుకుంటామని.. ఈ సినిమా రీ రిలీజ్ పూర్తిగా అభిమానుల చేతుల మీదుగానే జరుగుతోందని.. ఎన్టీఆర్ను కూడా కలిసి ఈ షోల గురించి వివరించగా.. ఆయన ప్రోత్సహించారని ఒక వర్గం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ‘ఆది’ స్పెషల్ షోలు వేస్తున్న వాళ్లు కూడా ఇలాగే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకోవైపేమో తారక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ షోలకు కూడా ప్రణాళికలు రచిస్తోంది ఇంకో వర్గం. దాని గురించి పెద్దగా పట్టింపు లేదు కానీ.. సింహాద్రి, ఆది సినిమాల్లో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఏది చూడాలో, దేన్ని ఓన్ చేసుకోవాలో తెలియని అయోమయంలో అభిమానులు పడిపోతున్నారు.
This post was last modified on April 12, 2023 9:08 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…