Movie News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్


జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ వేరే హీరోల ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులతో వారికి నిరంతరం ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తారక్ అభిమానుల్లోనే అంతర్గతంగా గొడవలు జరుగుతుండటం గమనార్హం. ఇందుకు ఎన్టీఆర్ నటించిన రెండు పాత సినిమాలు కారణం అవుతున్నాయి.

టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండు నడుస్తున్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాలు కూడా కొన్ని ఈ వరుసలో రిలీజయ్యాయి. ఐతే మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈసారి రీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం గట్టిగా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులే లీడ్ తీసుకుని ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇందులో ఒక వర్గం ‘సింహాద్రి’ సినిమా స్పెషల్ షోలకు కొంచెం గట్టిగా ప్లాన్ చేసింది. నెల ముందు నుంచే దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. భారీ రిలీజ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.

కానీ తారక్ అభిమానుల్లో ఇంకో వర్గం ‘ఆది’ సినిమా రీ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంది. వాళ్లు కూడా కొంచెం గట్టిగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో రెండు వర్గాల మధ్య పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. తారక్ అభిమానులు ఈ సినిమానే చూడాలంటే ఈ సినిమానే చూడాలి అంటూ పరస్పరం ప్రకటనలు రిలీజ్ చేయడం.. ఆయా షోల ప్రత్యేకత గురించి వివరించడం చేస్తున్నారు.

ఇరు వర్గాల వాళ్లూ ఈ షోలు ఛారిటీ కోసమే అంటున్నారు. ‘సింహాద్రి’ షోలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధ పడుతున్న తారక్ అభిమానులను ఆదుకుంటామని.. ఈ సినిమా రీ రిలీజ్ పూర్తిగా అభిమానుల చేతుల మీదుగానే జరుగుతోందని.. ఎన్టీఆర్‌ను కూడా కలిసి ఈ షోల గురించి వివరించగా.. ఆయన ప్రోత్సహించారని ఒక వర్గం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ‘ఆది’ స్పెషల్ షోలు వేస్తున్న వాళ్లు కూడా ఇలాగే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకోవైపేమో తారక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ షోలకు కూడా ప్రణాళికలు రచిస్తోంది ఇంకో వర్గం. దాని గురించి పెద్దగా పట్టింపు లేదు కానీ.. సింహాద్రి, ఆది సినిమాల్లో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఏది చూడాలో, దేన్ని ఓన్ చేసుకోవాలో తెలియని అయోమయంలో అభిమానులు పడిపోతున్నారు.

Satya

Recent Posts

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

14 minutes ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

47 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

1 hour ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

1 hour ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

2 hours ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago