జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ వేరే హీరోల ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులతో వారికి నిరంతరం ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తారక్ అభిమానుల్లోనే అంతర్గతంగా గొడవలు జరుగుతుండటం గమనార్హం. ఇందుకు ఎన్టీఆర్ నటించిన రెండు పాత సినిమాలు కారణం అవుతున్నాయి.
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండు నడుస్తున్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాలు కూడా కొన్ని ఈ వరుసలో రిలీజయ్యాయి. ఐతే మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈసారి రీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం గట్టిగా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులే లీడ్ తీసుకుని ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇందులో ఒక వర్గం ‘సింహాద్రి’ సినిమా స్పెషల్ షోలకు కొంచెం గట్టిగా ప్లాన్ చేసింది. నెల ముందు నుంచే దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. భారీ రిలీజ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
కానీ తారక్ అభిమానుల్లో ఇంకో వర్గం ‘ఆది’ సినిమా రీ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంది. వాళ్లు కూడా కొంచెం గట్టిగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో రెండు వర్గాల మధ్య పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. తారక్ అభిమానులు ఈ సినిమానే చూడాలంటే ఈ సినిమానే చూడాలి అంటూ పరస్పరం ప్రకటనలు రిలీజ్ చేయడం.. ఆయా షోల ప్రత్యేకత గురించి వివరించడం చేస్తున్నారు.
ఇరు వర్గాల వాళ్లూ ఈ షోలు ఛారిటీ కోసమే అంటున్నారు. ‘సింహాద్రి’ షోలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధ పడుతున్న తారక్ అభిమానులను ఆదుకుంటామని.. ఈ సినిమా రీ రిలీజ్ పూర్తిగా అభిమానుల చేతుల మీదుగానే జరుగుతోందని.. ఎన్టీఆర్ను కూడా కలిసి ఈ షోల గురించి వివరించగా.. ఆయన ప్రోత్సహించారని ఒక వర్గం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ‘ఆది’ స్పెషల్ షోలు వేస్తున్న వాళ్లు కూడా ఇలాగే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకోవైపేమో తారక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ షోలకు కూడా ప్రణాళికలు రచిస్తోంది ఇంకో వర్గం. దాని గురించి పెద్దగా పట్టింపు లేదు కానీ.. సింహాద్రి, ఆది సినిమాల్లో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఏది చూడాలో, దేన్ని ఓన్ చేసుకోవాలో తెలియని అయోమయంలో అభిమానులు పడిపోతున్నారు.
This post was last modified on April 12, 2023 9:08 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…