జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ వేరే హీరోల ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులతో వారికి నిరంతరం ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు తారక్ అభిమానుల్లోనే అంతర్గతంగా గొడవలు జరుగుతుండటం గమనార్హం. ఇందుకు ఎన్టీఆర్ నటించిన రెండు పాత సినిమాలు కారణం అవుతున్నాయి.
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండు నడుస్తున్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాలు కూడా కొన్ని ఈ వరుసలో రిలీజయ్యాయి. ఐతే మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈసారి రీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం గట్టిగా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులే లీడ్ తీసుకుని ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇందులో ఒక వర్గం ‘సింహాద్రి’ సినిమా స్పెషల్ షోలకు కొంచెం గట్టిగా ప్లాన్ చేసింది. నెల ముందు నుంచే దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు. భారీ రిలీజ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
కానీ తారక్ అభిమానుల్లో ఇంకో వర్గం ‘ఆది’ సినిమా రీ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంది. వాళ్లు కూడా కొంచెం గట్టిగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో రెండు వర్గాల మధ్య పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. తారక్ అభిమానులు ఈ సినిమానే చూడాలంటే ఈ సినిమానే చూడాలి అంటూ పరస్పరం ప్రకటనలు రిలీజ్ చేయడం.. ఆయా షోల ప్రత్యేకత గురించి వివరించడం చేస్తున్నారు.
ఇరు వర్గాల వాళ్లూ ఈ షోలు ఛారిటీ కోసమే అంటున్నారు. ‘సింహాద్రి’ షోలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధ పడుతున్న తారక్ అభిమానులను ఆదుకుంటామని.. ఈ సినిమా రీ రిలీజ్ పూర్తిగా అభిమానుల చేతుల మీదుగానే జరుగుతోందని.. ఎన్టీఆర్ను కూడా కలిసి ఈ షోల గురించి వివరించగా.. ఆయన ప్రోత్సహించారని ఒక వర్గం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ‘ఆది’ స్పెషల్ షోలు వేస్తున్న వాళ్లు కూడా ఇలాగే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకోవైపేమో తారక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ షోలకు కూడా ప్రణాళికలు రచిస్తోంది ఇంకో వర్గం. దాని గురించి పెద్దగా పట్టింపు లేదు కానీ.. సింహాద్రి, ఆది సినిమాల్లో తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఏది చూడాలో, దేన్ని ఓన్ చేసుకోవాలో తెలియని అయోమయంలో అభిమానులు పడిపోతున్నారు.
This post was last modified on April 12, 2023 9:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…