Movie News

ఎవ్వరూ ఫోన్ చేయలేదు.. సమంత ఆశ్చర్యం


తాను అనారోగ్యంతో ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలు స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది సమంత. గత ఏడాది ఆమె మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బుతో పోరాడిన సంగతి తెలిసిందే. దీని వల్ల కొన్ని వారాల పాటు సామ్ ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని నెలలు ఇంటికే పరిమితం అయింది. దీంతో ఆమె నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూట్ చాన్నాళ్ల పాటు ఆగిపోయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించాల్సిన వేరే సినిమాలు కూడా ఆలస్యం అయ్యాయి. కానీ తన వల్ల ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ ఎవ్వరూ కూడా ఫోన్ చేసి షూటింగ్‌కు ఎప్పుడు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదని సమంత చెప్పింది.

“అనారోగ్యంతో నేను చాలా రోజుల పాటు షూటింగ్‌లకు దూరమయ్యాను. నేను ఇబ్బందుల్లో ఉన్నపుడు ఇండస్ట్రీ నాకెంతో సపోర్ట్ చేసింది. ముఖ్యంగా నిర్మాతలు నాకు అండగా నిలిచారు. ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఫోన్ చేసి ఎప్పుడు షూటింగ్‌కు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదు. నేను అందుబాటులోకి వచ్చే వరకూ ఓపిగ్గా ఎదురు చూశారు. ఇది నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది” అని విలేకరుల సమావేశంలో సామ్ తెలిపింది.

జీవితంలో ఎదురైన సమస్యలు తనను మరింత దృఢంగా మార్చాయని సమంత ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. గత రెండేళ్లలో తన జీవితంలో అనేక ఊహించని పరిణామాలు జరిగాయని.. సమస్యలు ఎదురైనపుడు ముందు ఇబ్బంది పడ్డా.. తర్వాత వాటిలో పడి మనల్ని మనం నాశనం చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని.. ఈ క్రమంలో తాను మునుపటి కంటే చాలా దృఢంగా మారానని.. ఇప్పుడు దేన్నయినా ఎదుర్కోగలం అనే ధైర్యం వచ్చిందని సమంత తెలిపింది.

This post was last modified on April 12, 2023 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్ వచ్చే వరకు కటకటేనా?

టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…

28 minutes ago

హిట్టు కోసం ఇద్దరు దర్శకులతో ఒకేసారి

టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…

1 hour ago

ర‌ఘురామ‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌…

టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు త‌ల‌పెట్టి రామాయ‌ల‌ నిర్మాణానికి సంబంధించిన ఇక్క‌ట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయ‌న సొంత…

2 hours ago

ప‌నిమ‌నిషి-ఆటో డ్రైవ‌ర్‌-కార్ డ్రైవ‌ర్‌… లైఫ్ మారిపోయింది

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అసామాన్యులు విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. వార‌సులు గెలుపు గుర్రాలు ఎక్క‌డం.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న హేమాహేమీలు…

2 hours ago

పైలట్ల గొడవ.. విమానంతో 132 మందిని చంపేశారా?

చైనాలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా ఈస్టర్న్…

2 hours ago

జననాగయన్‌… తెలుగులోనూ ప్రభంజనమేనా?

పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతూ తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం.. జననాగయన్. ఇది తెలుగు హిట్…

2 hours ago