Movie News

ఎవ్వరూ ఫోన్ చేయలేదు.. సమంత ఆశ్చర్యం


తాను అనారోగ్యంతో ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలు స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది సమంత. గత ఏడాది ఆమె మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బుతో పోరాడిన సంగతి తెలిసిందే. దీని వల్ల కొన్ని వారాల పాటు సామ్ ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని నెలలు ఇంటికే పరిమితం అయింది. దీంతో ఆమె నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూట్ చాన్నాళ్ల పాటు ఆగిపోయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించాల్సిన వేరే సినిమాలు కూడా ఆలస్యం అయ్యాయి. కానీ తన వల్ల ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ ఎవ్వరూ కూడా ఫోన్ చేసి షూటింగ్‌కు ఎప్పుడు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదని సమంత చెప్పింది.

“అనారోగ్యంతో నేను చాలా రోజుల పాటు షూటింగ్‌లకు దూరమయ్యాను. నేను ఇబ్బందుల్లో ఉన్నపుడు ఇండస్ట్రీ నాకెంతో సపోర్ట్ చేసింది. ముఖ్యంగా నిర్మాతలు నాకు అండగా నిలిచారు. ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఫోన్ చేసి ఎప్పుడు షూటింగ్‌కు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదు. నేను అందుబాటులోకి వచ్చే వరకూ ఓపిగ్గా ఎదురు చూశారు. ఇది నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది” అని విలేకరుల సమావేశంలో సామ్ తెలిపింది.

జీవితంలో ఎదురైన సమస్యలు తనను మరింత దృఢంగా మార్చాయని సమంత ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. గత రెండేళ్లలో తన జీవితంలో అనేక ఊహించని పరిణామాలు జరిగాయని.. సమస్యలు ఎదురైనపుడు ముందు ఇబ్బంది పడ్డా.. తర్వాత వాటిలో పడి మనల్ని మనం నాశనం చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని.. ఈ క్రమంలో తాను మునుపటి కంటే చాలా దృఢంగా మారానని.. ఇప్పుడు దేన్నయినా ఎదుర్కోగలం అనే ధైర్యం వచ్చిందని సమంత తెలిపింది.

This post was last modified on April 12, 2023 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కవితకు మరో షాక్ ఇవ్వనున్న బీఆర్ఎస్?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్‌కు ఊహించ‌ని సంక‌టం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. క‌విత.. పాత `టీఆర్ ఎస్‌`…

5 hours ago

నాగబాబు వల్ల కానిది నీహారిక చేస్తోంది

తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…

6 hours ago

ఈ గోటీల గోలేంటి రాజశేఖర

సీనియర్ నటుడు రాజశేఖర్‌కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…

6 hours ago

ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లుకు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే…

7 hours ago

మావిగన్ క్రెడిట్… జగన్ పై తోసేసిన సజ్జల

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…

7 hours ago

గందరగోళం ఎప్పుడు తీరుతుంది పెద్ది

ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…

7 hours ago