తాను అనారోగ్యంతో ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలు స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది సమంత. గత ఏడాది ఆమె మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బుతో పోరాడిన సంగతి తెలిసిందే. దీని వల్ల కొన్ని వారాల పాటు సామ్ ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని నెలలు ఇంటికే పరిమితం అయింది. దీంతో ఆమె నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూట్ చాన్నాళ్ల పాటు ఆగిపోయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించాల్సిన వేరే సినిమాలు కూడా ఆలస్యం అయ్యాయి. కానీ తన వల్ల ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ ఎవ్వరూ కూడా ఫోన్ చేసి షూటింగ్కు ఎప్పుడు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదని సమంత చెప్పింది.
“అనారోగ్యంతో నేను చాలా రోజుల పాటు షూటింగ్లకు దూరమయ్యాను. నేను ఇబ్బందుల్లో ఉన్నపుడు ఇండస్ట్రీ నాకెంతో సపోర్ట్ చేసింది. ముఖ్యంగా నిర్మాతలు నాకు అండగా నిలిచారు. ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఫోన్ చేసి ఎప్పుడు షూటింగ్కు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదు. నేను అందుబాటులోకి వచ్చే వరకూ ఓపిగ్గా ఎదురు చూశారు. ఇది నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది” అని విలేకరుల సమావేశంలో సామ్ తెలిపింది.
జీవితంలో ఎదురైన సమస్యలు తనను మరింత దృఢంగా మార్చాయని సమంత ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. గత రెండేళ్లలో తన జీవితంలో అనేక ఊహించని పరిణామాలు జరిగాయని.. సమస్యలు ఎదురైనపుడు ముందు ఇబ్బంది పడ్డా.. తర్వాత వాటిలో పడి మనల్ని మనం నాశనం చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని.. ఈ క్రమంలో తాను మునుపటి కంటే చాలా దృఢంగా మారానని.. ఇప్పుడు దేన్నయినా ఎదుర్కోగలం అనే ధైర్యం వచ్చిందని సమంత తెలిపింది.
This post was last modified on April 12, 2023 9:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…