ప్రస్తుతం యంగ్ హీరోలతో సమానంగా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు చిరు. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఎలాంటి బ్రేక్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన మెగాస్టార్ మే నెలలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి స్టేజీకి చేరుకుంది. అయితే ఈ సినిమా తర్వాత చిరు కొన్ని నెలలు బ్రేక్ తీసుకోబోతున్నాడు. దానికి కారణం చిరు నెక్స్ట్ సినిమా ఫిక్స్ కాకపోవడమే. అవును మెగా స్టార్ మెగా లైనప్ పెట్టుకున్నారు. కానీ ఏది ఫైనల్ అవ్వలేదు.
కొందరు రైటర్స్ , డైరెక్టర్స్ ఇప్పటికే చిరుకి కొన్ని కథలు వినిపించారు. కానీ చిరు ను ఎగ్జైట్ చేసే ప్రాజెక్ట్ దొరకలేదు. నిజానికి మెహర్ రమేష్ సినిమా తర్వాత చిరు వెంకీ కుడుముల తో దానయ్య బేనర్ లో సినిమా చేయాలి కానీ అది క్యాన్సిల్ అయింది. దానయ్య చిరు కోసం మరో కథ , దర్శకుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నెక్స్ట్ సినిమా దానయ్య కే చేసే ఛాన్స్ ఉంది. కానీ ఈ లోపు మరో నిర్మాత ఎవరైనా కథ ప్లస్ దర్శకుడితో అప్రోచ్ అయితే మెగా స్టార్ అటు వెళ్లిపోయే అవకాశం ఉంది.
ఏదేమైనా ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య గా థియేటర్స్ లోకి వచ్చిన చిరు ఐదు నెలలోపే భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక మెగా స్టార్ నుండి వచ్చే నెక్స్ట్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే ఉండవచ్చు. భోళా తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మరో సినిమాను సెట్స్ పైకి తెస్తారు చిరు.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…