వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు బాబీ కొత్త సినిమా ఏదనే సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది. అది విడుదలై మూడు నెలలు దాటినా ఇప్పటిదాకా అనౌన్స్ మెంట్ లేదు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది కూడా దిల్ రాజు నిర్మాత అనగానే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఖరారు చేయలేం కానీ నిప్పులేనిదే పొగరాదనే సామెతను మర్చిపోకూడదు. అదే జరిగితే బాబీ నక్క తోక తొక్కినట్టే.
వరసగా మెగాస్టార్, తమిళ సూపర్ స్టార్ లను డీల్ చేయాల్సి రావడం చాలా కొద్దిమందికే దక్కే అదృష్టం. వినడానికి బాగానే ఉంది కానీ తలైవా ఇమేజ్ ని బాబీ మోయగలడా అనే సందేహాలు అభిమానులకు వస్తున్నాయి. ఎందుకంటే ఇతనికి హిట్లు ఎన్నున్నాయని పక్కనపెడితే యునానిమస్ గా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ ని గొప్పగా డీల్ చేశాడనే పేరు ఎప్పుడూ రాలేదు. ఇద్దరు హీరోలున్నా వెంకీ మామ యావరేజ్ అయ్యింది. జై లవకుశ కథా కథనాల కంటే జూనియర్ ఎన్టీఆర్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ వల్ల ఎక్కువ ఆడింది. సర్దార్ గబ్బర్ సింగ్ గురించి తెలిసిందే.
పవర్ ఒకటే చెప్పుకోదగ్గ విజయం. మరి ఇలాంటి ట్రాక్ రికార్డుతో బాబీ రజినిని బాలన్స్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే కోలీవుడ్ లో ఎంతో పేరున్న సిరుతై శివ(పెద్దన్న), మురుగదాస్(దర్బార్), కార్తీక్ సుబ్బరాజ్(పేట), పా రంజిత్(కాలా-కబాలి)లు ఆయన్ని సరిగ్గా వాడుకోలేక ఫ్లాప్ నుంచి సూపర్ హిట్ మధ్యలో ఫలితాలు అందుకున్నారు తప్ప యునానిమస్ బ్లాక్ బస్టర్లు కొట్టలేదు. మరి వాళ్ళ వల్లే కానిది బాబీ ఎంత మేరకు హ్యాండిల్ చేయగలడో చూడాలి. వాల్తేరు వీరయ్య చూసి రజిని సానుకూలంగా స్పందించారా లేక ఇంకేదైనా కారణముందా లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 12, 2023 12:33 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…