సూపర్ స్టార్ మహేష్ బాబు తన నిర్ణయాల పట్ల ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఫ్యాన్స్ కే కాదు ఆయనతో దగ్గరగా మసిలే అందరికీ తెలుసు. పుష్ప ముందు వెళ్ళింది తన దగ్గరికే. సుకుమార్ ఎంత కన్విక్షన్ తో స్క్రిప్ట్ వినిపించినా ఆ పాత్ర అభిమానుల అంచనాలకు మ్యాచ్ కాదని చాలా అలోచించి చివరికి నో చెప్పారు. తర్వాత అది అల్లు అర్జున్ తప్ప ఇంకెవరికీ సూట్ కాదని అక్షరాలా ఋజువయ్యింది. తాజాగా విడుదల పార్ట్ 1 ప్రీమియర్ షో ప్రెస్ మీట్ సందర్భంగా దర్శకుడు వెట్రిమారన్ చెప్పిన ఒక ముచ్చట మరోసారి దీన్ని ఖరారు చేసింది. గతంలో ఒక కథ కోసం ఇద్దరూ కలుసుకున్నారట.
వడ చెన్నైకు ముందు వెట్రిమారన్ బన్నీతో పాటు మహేష్ నూ కలిశాడు. కానీ ఈయన చెప్పిన లైన్లు నచ్చకో లేక ఆయన స్టైల్ హీరోయిజంని ఇక్కడ ఒప్పుకోరనే వాస్తవాన్ని గుర్తించవడం వల్లో చివరికది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఈ కాంబో కనక సెట్ అయ్యుంటే మేకింగ్ ఎంత గొప్పగా ఉన్నా మన ఆడియన్స్ ఆ తరహా మేకింగ్ ని రిసీవ్ చేసుకోవడం కష్టం. జాతీయ అవార్డులు సాధించిన ఆడుకాలం, విసరనై తెలుగు డబ్బింగులు కనీస స్థాయిలో ఆడకపోవడం కన్నా ఉదాహరణ అక్కర్లేదు. మహేష్ లాంటి స్టార్లను వెట్రిమారన్ డీల్ చేయలేరు.
ఎలా చూసినా మహేష్ నిర్ణయాలు సరైనవే. కొన్ని కాంబోలు వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా మారితే ఇబ్బందే. అందుకే అంతా మన మంచికే అనుకోవాలి. విడుదల పార్ట్ 1 ప్రమోషన్ల కోసం టీమ్ తో సహా హైదరాబాద్ వచ్చిన వెట్రిమారన్ ఈ సారి టాలీవుడ్ ఫ్యాన్స్ తనను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు. పచ్చి నిజాలను అంతే పచ్చిగా తెరమీద చూపిస్తారని పేరున్న ఈ కల్ట్ దర్శకుడి మేకింగ్ ని ఇక్కడి జనాలకు ఎంత మేరకు కనెక్ట్ అవుతుందన్నది చూడాలి. తమిళనాడులో గత నెల 31న రిలీజైన విడుతలైకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే దక్కాయి.
This post was last modified on April 12, 2023 10:27 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…