గత ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాల దెబ్బకు రవితేజ కెరీర్ కుదేలైనట్లు కనిపించింది. కానీ ఆ ప్రభావం ఏమీ కనిపించనివ్వకుండా ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. డివైడ్ టాక్తోనూ ఈ సినిమా వంద కోట్ల వసూళ్ల మార్కును దాటడం అనూహ్యం. మాస్ రాజా ఈ ఆనందంలో ఉండగానే ఆయన ప్రత్యేక పాత్ర చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సైతం ఘనవిజయాన్నందుకుంది. ఈ దెబ్బతో మళ్లీ కెరీర్ పీక్స్ అందుకున్నట్లే కనిపించాడు రవితేజ. ఈ ఊపులో ఇంకో హిట్ కొడితే రవితేజ దశ తిరిగిపోయేది.
కానీ మాస్ రాజా కొత్త చిత్రం ‘రావణాసుర’ ఆయన జోరుకు బ్రేక్ వేసేసింది. ఎంన్దుకో ఈ సినిమాపై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ ముంగిట అంతగా హైప్ కూడా కనిపించలేదు. అందుకు తగ్గట్లే సినిమాకు మంచి టాక్ కూడా రాలేదు. కాకపోతే మాస్ రాజా ఊపు వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి.
మూడు రోజుల తొలి వీకెండ్లో ‘రావణాసుర’ వరల్డ్ వైడ్ రూ.9 కోట్లకు కాస్త ఎక్కువగా షేర్ రాబట్టింది. మాస్ రాజా రేంజికి ఇది చిన్న ఫిగరే. కానీ సినిమాకు వచ్చిన టాక్తో పోలిస్తే పర్వాలేదని చెప్పాలి. వీక్ డేస్లో సినిమా కాస్త నిలబడితే.. బయ్యర్లు సేఫ్ జోన్లోకి రావడానికి ఛాన్సుంటుందని అనుకున్నారు. కానీ డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా, పైగా ప్రమోషన్ల ద్వారా పుష్ చేసే ప్రయత్నమూ జరగట్లేదు. దీంతో సోమవారం ‘రావణాసుర’ క్రాష్ అయిపోయింది.
సినిమాకు నాలుగో రోజు వరల్డ్ వైడ్ కోటి రూపాయల షేర్ కూడా రాని పరిస్థితి. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ షేర్స్ నామమాత్రంగా ఉండటంతో ఓవరాల్ కలెక్షన్ల ఫిగర్లు కూడా సరిగా రావట్లేదు. సినిమా సోమవారం మార్నింగ్ షోలతో పడుకుండిపోయిందని.. ఇక లేవదని అర్థమైపోయింది. సాయంత్రం షోలకు కూడా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ‘రావణాసుర’ డిజాస్టర్ అనే విషయం ఖరారైపోయినట్లే.
This post was last modified on April 11, 2023 5:46 pm
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా…
26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై…
ఏపీలోని అన్నమయ్య జిల్లా వెలసిన ఒంటమిట్ల రాములోరికి శుక్రవారం భారీ బంగారు కిరీటాలు విరాళంగా అందాయి. రాములోరితో పాటుగా సీతమ్మ…
"మాది బీసీ పక్షపాత పార్టీ. ఇంకా చెప్పాలంటే.. బీసీల పార్టీ" అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యా ఖ్యానించారు.…
ఖాకీ చొక్కను వదిలి ఖద్దరు చొక్కా వేసుకున్న వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సాయంత్రం…