కెరీర్లో చాలా ఏళ్లు చిన్మయి వాయిస్తోనే బండి నడిపించింది సమంత. ఆమెకు కెరీర్లో ఎదగడానికి చిన్మయితో చెప్పించుకున్న డబ్బింగ్ ఒక ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు. తెలుగులో తన తొలి చిత్రం ఏమాయ చేసావె చూసి ప్రేక్షకులు మైమరిచిపోవడంలో చిన్మయి డబ్బింగ్ కీలకం అయింది.
ఐతే తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తూ.. ఇక్కడే నివాసం ఉంటూ తెలుగు మీద పట్టు సంపాదించిన సామ్.. కొన్నేళ్ల నుంచి తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఐతే మామూలు సినిమాలంటే ఓకే కానీ.. శాకుంతలం లాంటి పౌరాణిక చిత్రంలో గ్రాంథిక డైలాగులను కూడా సమంతే చెప్పడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమాకు ఇది మైనస్ అవుతుందేమో అన్న చర్చ కూడా నడిచింది. కానీ సమంత వెనుకంజ వేయలేదు. టీజర్, ట్రైలర్లలోనే కాదు పూర్తి సినిమాలోనూ తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
విశేషం ఏంటంటే.. సమంత వాయిస్ తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ వినిపించబోతోంది. సమంత బేసిగ్గా తమిళ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి తెలుగులో చెప్పాక తమిళంలో కూడా డబ్బింగ్ చెప్పడానికి వెనుకాడి ఉండదు. ఐతే హిందీ మీద పెద్దగా పట్టు లేకపోయినా.. కష్టపడి ఆ భాషలో కూడా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది సామ్.
ఐతే ఇదంతా తేలికగా ఏమీ జరగలేదని అంటోందామె. వేర్వేరు భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. మిగతా నటీనటులు ఈ పని ఎలా చేస్తారో తెలియదు. నేను మాత్రం చాలా కష్టపడ్డా. చాలాసార్లు రిహార్సల్స్ చేసుకుని తర్వాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఐతే నేను సరిగ్గానే డైలాగులు చెప్పానని అనుకుంటున్నా. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా అని సమంత పేర్కొంది. గుణశేఖర్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14న ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 12, 2023 6:14 am
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…