కెరీర్లో చాలా ఏళ్లు చిన్మయి వాయిస్తోనే బండి నడిపించింది సమంత. ఆమెకు కెరీర్లో ఎదగడానికి చిన్మయితో చెప్పించుకున్న డబ్బింగ్ ఒక ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు. తెలుగులో తన తొలి చిత్రం ఏమాయ చేసావె చూసి ప్రేక్షకులు మైమరిచిపోవడంలో చిన్మయి డబ్బింగ్ కీలకం అయింది.
ఐతే తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తూ.. ఇక్కడే నివాసం ఉంటూ తెలుగు మీద పట్టు సంపాదించిన సామ్.. కొన్నేళ్ల నుంచి తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఐతే మామూలు సినిమాలంటే ఓకే కానీ.. శాకుంతలం లాంటి పౌరాణిక చిత్రంలో గ్రాంథిక డైలాగులను కూడా సమంతే చెప్పడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమాకు ఇది మైనస్ అవుతుందేమో అన్న చర్చ కూడా నడిచింది. కానీ సమంత వెనుకంజ వేయలేదు. టీజర్, ట్రైలర్లలోనే కాదు పూర్తి సినిమాలోనూ తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
విశేషం ఏంటంటే.. సమంత వాయిస్ తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ వినిపించబోతోంది. సమంత బేసిగ్గా తమిళ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి తెలుగులో చెప్పాక తమిళంలో కూడా డబ్బింగ్ చెప్పడానికి వెనుకాడి ఉండదు. ఐతే హిందీ మీద పెద్దగా పట్టు లేకపోయినా.. కష్టపడి ఆ భాషలో కూడా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది సామ్.
ఐతే ఇదంతా తేలికగా ఏమీ జరగలేదని అంటోందామె. వేర్వేరు భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. మిగతా నటీనటులు ఈ పని ఎలా చేస్తారో తెలియదు. నేను మాత్రం చాలా కష్టపడ్డా. చాలాసార్లు రిహార్సల్స్ చేసుకుని తర్వాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఐతే నేను సరిగ్గానే డైలాగులు చెప్పానని అనుకుంటున్నా. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా అని సమంత పేర్కొంది. గుణశేఖర్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14న ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 12, 2023 6:14 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…