కెరీర్లో చాలా ఏళ్లు చిన్మయి వాయిస్తోనే బండి నడిపించింది సమంత. ఆమెకు కెరీర్లో ఎదగడానికి చిన్మయితో చెప్పించుకున్న డబ్బింగ్ ఒక ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు. తెలుగులో తన తొలి చిత్రం ఏమాయ చేసావె చూసి ప్రేక్షకులు మైమరిచిపోవడంలో చిన్మయి డబ్బింగ్ కీలకం అయింది.
ఐతే తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తూ.. ఇక్కడే నివాసం ఉంటూ తెలుగు మీద పట్టు సంపాదించిన సామ్.. కొన్నేళ్ల నుంచి తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఐతే మామూలు సినిమాలంటే ఓకే కానీ.. శాకుంతలం లాంటి పౌరాణిక చిత్రంలో గ్రాంథిక డైలాగులను కూడా సమంతే చెప్పడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమాకు ఇది మైనస్ అవుతుందేమో అన్న చర్చ కూడా నడిచింది. కానీ సమంత వెనుకంజ వేయలేదు. టీజర్, ట్రైలర్లలోనే కాదు పూర్తి సినిమాలోనూ తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
విశేషం ఏంటంటే.. సమంత వాయిస్ తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ వినిపించబోతోంది. సమంత బేసిగ్గా తమిళ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి తెలుగులో చెప్పాక తమిళంలో కూడా డబ్బింగ్ చెప్పడానికి వెనుకాడి ఉండదు. ఐతే హిందీ మీద పెద్దగా పట్టు లేకపోయినా.. కష్టపడి ఆ భాషలో కూడా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది సామ్.
ఐతే ఇదంతా తేలికగా ఏమీ జరగలేదని అంటోందామె. వేర్వేరు భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. మిగతా నటీనటులు ఈ పని ఎలా చేస్తారో తెలియదు. నేను మాత్రం చాలా కష్టపడ్డా. చాలాసార్లు రిహార్సల్స్ చేసుకుని తర్వాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఐతే నేను సరిగ్గానే డైలాగులు చెప్పానని అనుకుంటున్నా. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా అని సమంత పేర్కొంది. గుణశేఖర్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14న ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 12, 2023 6:14 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…