Movie News

నంది అవార్డుల‌పై విజ‌యేంద్ర విన్న‌పం

రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిసి ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌గా ఉన్న‌పుడు.. సినీ రంగంలోని వారంతా నంది అవార్డుల‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించేవారు. ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించేది. వీటి ఎంపిక ప‌క‌డ్బందీగా జ‌రిగేది. అవార్డులు గెలుచుకున్న వాళ్ల ఆనందానికి అవ‌ధులు ఉండేవి కావు. నంది అవార్డుల గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేవారు.

కానీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాక క‌థ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం ద‌క్క‌లేదు. త‌ర్వాత అవార్డులు ఇవ్వ‌డ‌మే మానేశారు. జ‌గ‌న్ స‌ర్కారు అయితే అస్స‌లు ఈ అవార్డుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల పాల‌కుల‌కు నంది అవార్డుల కోసం సినీ పెద్ద‌లు విన్న‌పాలు చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

చంద్ర‌బాబు హ‌యాంలో నంది అవార్డుల ఎంపిక‌పై ఇటీవ‌ల పోసాని కృష్ణ‌ముర‌ళి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్న త‌రుణంలో లెజెండ‌రీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్.. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ అవార్డుల కోసం విన్న‌వించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం నంది అవార్డులు ఇచ్చి సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించాలి. సినిమా అనేది శ‌క్తిమంత‌మైన మాధ్య‌మం. తెలంగాణ సంస్కృతిని, ప్ర‌తిబింబించే, కొత్త‌గా చూపించే చిత్రాల‌కు క‌చ్చితంగా అవార్డులు ఇచ్చి ప్రోత్స‌హించాలి. దీని వ‌ల్ల రాష్ట్ర సంస్కృతిని మ‌రింతగా చూపించే సినిమాలు వ‌స్తాయి. దీని వ‌ల్ల ప‌ర్యాట‌కంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే తెలంగాణ‌లో 90 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిపే సినిమాల‌కు రాయితీలు ఇచ్చి ప్రోత్స‌హించాలి.

దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌కు ప‌ర్యాట‌కులు పెరిగారు. అలాగే తెలంగాణ‌ సినిమాల‌ను ప్రోత్స‌హిస్తే టూరిజం అభివృద్ధి చెందుతుంది అని ఫిలిం ఛాంబ‌ర్లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో విజ‌యేంద్ర అన్నారు.

This post was last modified on April 11, 2023 9:35 am

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

57 minutes ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

1 hour ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

1 hour ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

5 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

5 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

5 hours ago