రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నపుడు.. సినీ రంగంలోని వారంతా నంది అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించేది. వీటి ఎంపిక పకడ్బందీగా జరిగేది. అవార్డులు గెలుచుకున్న వాళ్ల ఆనందానికి అవధులు ఉండేవి కావు. నంది అవార్డుల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేవారు.
కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కథ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డులను పక్కన పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం దక్కలేదు. తర్వాత అవార్డులు ఇవ్వడమే మానేశారు. జగన్ సర్కారు అయితే అస్సలు ఈ అవార్డులను పట్టించుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల పాలకులకు నంది అవార్డుల కోసం సినీ పెద్దలు విన్నపాలు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు.
చంద్రబాబు హయాంలో నంది అవార్డుల ఎంపికపై ఇటీవల పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్న తరుణంలో లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డుల కోసం విన్నవించడం గమనార్హం. ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలి. సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. తెలంగాణ సంస్కృతిని, ప్రతిబింబించే, కొత్తగా చూపించే చిత్రాలకు కచ్చితంగా అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. దీని వల్ల రాష్ట్ర సంస్కృతిని మరింతగా చూపించే సినిమాలు వస్తాయి. దీని వల్ల పర్యాటకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే తెలంగాణలో 90 శాతం చిత్రీకరణ జరిపే సినిమాలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి.
దిల్వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా తర్వాత స్విట్జర్లాండ్కు పర్యాటకులు పెరిగారు. అలాగే తెలంగాణ సినిమాలను ప్రోత్సహిస్తే టూరిజం అభివృద్ధి చెందుతుంది అని ఫిలిం ఛాంబర్లో జరిగిన ఓ కార్యక్రమంలో విజయేంద్ర అన్నారు.
This post was last modified on April 11, 2023 9:35 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…