సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా, గొడవపడినా, విడాకులు తీసుకున్నా ఇలా ఏం చేసినా న్యూసే. కాకపోతే కొన్ని నేరుగా చెప్పరు. వాళ్ళ చర్యల ద్వారా మనమే అర్థం చేసుకోవాలి. మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక వివాహ బంధం విడిపోయే దాకా వచ్చిందని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ జంట సోషల్ మీడియా అకౌంట్లలో సందర్భం లేకుండా ఫోటోలను డిలీట్ చేసుకోవడం లాంటి పనుల వల్ల ఫ్యాన్స్ కి మ్యాటరేంటో సులభంగానే అర్థమైపోయింది. కాకపోతే ఖచ్చితంగా ఏం జరిగిందనే వివరణ మెగా వర్గాల నుంచి రాలేదు. తాజాగా నీహారిక మరో క్లారిటీ ఇచ్చింది
రెండు రోజుల క్రితం వరకు ఇన్స్ టాలో ఉన్న భర్త వెంకట చైతన్యకు సంబంధించిన ఫొటోలన్నీ డిలీట్ కొట్టేసింది. అంతే కాదు అతన్ని అన్ ఫాలో కూడా చేసుకుంది. ఇలా పరస్పరం తమ వ్యతిరేకతను బయట పెట్టుకున్న ఈ దంపతులు త్వరలో డైవర్స్ కు వెళ్తారని సమాచారం. ఇదంతా లీగల్ గా జరగాల్సిన వ్యవహారం కాబట్టి ఒక కొలిక్కి వచ్చాక పబ్లిక్ కి చెప్పే అవకాశం ఉంది. ఈ విషయంలో నిహారిక సమంతను ఫాలో అయ్యేలా ఉంది. ఊరికే తొందరపడి ఏదో ఒకటి చెప్పేయకుండా అన్నీ అయ్యాక స్పష్టంగా సోషల్ మీడియాలో చెప్పేస్తే ఏ గొడవా ఉండదు
ఈ వ్యవహారం పట్ల నాగబాబు స్పందన ఎక్కడా లేదు. చిరంజీవి వీటి పట్ల ముందు నుంచి ఓపెన్ గా మాట్లాడరు కాబట్టి ఏదున్నా అంతర్గతంగానే ముగిసిపోనుంది. ఇప్పటికీ కళ్యాణ్ దేవ్ శ్రీజల బంధం గురించి ఎన్ని వార్తలు వచ్చినా మౌనంగా ఉన్నారు తప్పించి అసలు కలిసే ఉన్నారని కానీ విడిగా ఉన్నారని కానీ చెప్పలేదు. అల్లుడు బ్రాండ్ తో సినిమాలు చేసుకుంటూ వచ్చిన కళ్యాణ్ దేవ్ కి ఇప్పుడు అవకాశాలే లేవు. వచ్చినవన్నీ డిజాస్టర్లే అయ్యాయి. నీహారిక ఇకపై ప్రొడక్షన్లో బిజీ కానుందని తన కొత్త ఆఫీస్ ఫోటోలను పోస్ట్ చేయడం బట్టి స్పష్టత వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…