వచ్చే నెల మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ప్రత్యేకంగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఇండస్ట్రీ హిట్ ని మళ్ళీ తెరపై చూడబోతున్నామంటూ అభిమానులు పోస్టర్లను ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ వీడియోను వైరల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ అనడం గురించి ఇతర హీరోల ఫ్యాన్స్ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు దీని మీద సోషల్ మీడియా డిబేట్లు మొదలుపెట్టారు.
2003లో థియేటర్ యుఫోరియాని ప్రత్యక్షంగా చూసినవాళ్లకు మాత్రమే సింహాద్రి ఏ స్థాయిలో బ్లాక్ బస్టరో అర్థమవుతుంది. అప్పటికి కెరీర్ పరంగా ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్న తారక్ ని ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి లాకొచ్చిన ఆల్ టైం మాస్ హిట్ ఇది. పాతిక కోట్లకు పైగా వసూళ్ల షేర్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయడం అత్యధిక కేంద్రాల్లో వంద రోజులు (150), సిల్వర్ జూబ్లీలు(55) చేసుకోవడం అంతా చరిత్రలో ఉన్నదే. కొత్తగా పుట్టించిందేమీ కాదు. అయితే ఇండస్ట్రీ హిట్ అనే పదానికి నిర్వచనం ట్రేడ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఇవ్వడం వల్లే కొంత అయోమయం నెలకొంటుంది.
గత సినిమాల అత్యధిక వసూళ్లను దాటినవి మొదటి క్యాటగిరీ అయితే ఎక్కువ కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ చేసుకున్నవి రెండో విభాగం. సింహాద్రి ఇది రిలీజైన 2003 నాటికి ఇక్కడ చెప్పిన వాటిలో సెకండ్ జోన్ లోకి వస్తుంది. ఎలా చూసుకున్నా టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో దీనికి చోటున్న మాట వాస్తవం. చాలా సెంటర్స్ లో హయ్యెస్ట్ నెంబర్స్ నమోదు చేయడం గురించి నిర్మాత వి దొరస్వామిరాజు పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెప్పారు. ఏ సినిమాకైనా కలెక్షన్ల లెక్కలన్నీ నిజమేనని చెప్పడానికి పక్కా ఆధారాలు ఉండవు. ఆలా అని సింహాద్రి విజయాన్ని ఏ కోణంలోనూ తక్కువ చేయడానికి లేదు.
This post was last modified on April 10, 2023 5:15 pm
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసామాన్యులు విజయం దక్కించుకోవడం.. వారసులు గెలుపు గుర్రాలు ఎక్కడం.. వరుస విజయాలు దక్కించుకున్న హేమాహేమీలు…