వచ్చే నెల మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ప్రత్యేకంగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఇండస్ట్రీ హిట్ ని మళ్ళీ తెరపై చూడబోతున్నామంటూ అభిమానులు పోస్టర్లను ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ వీడియోను వైరల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ అనడం గురించి ఇతర హీరోల ఫ్యాన్స్ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు దీని మీద సోషల్ మీడియా డిబేట్లు మొదలుపెట్టారు.
2003లో థియేటర్ యుఫోరియాని ప్రత్యక్షంగా చూసినవాళ్లకు మాత్రమే సింహాద్రి ఏ స్థాయిలో బ్లాక్ బస్టరో అర్థమవుతుంది. అప్పటికి కెరీర్ పరంగా ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్న తారక్ ని ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి లాకొచ్చిన ఆల్ టైం మాస్ హిట్ ఇది. పాతిక కోట్లకు పైగా వసూళ్ల షేర్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయడం అత్యధిక కేంద్రాల్లో వంద రోజులు (150), సిల్వర్ జూబ్లీలు(55) చేసుకోవడం అంతా చరిత్రలో ఉన్నదే. కొత్తగా పుట్టించిందేమీ కాదు. అయితే ఇండస్ట్రీ హిట్ అనే పదానికి నిర్వచనం ట్రేడ్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఇవ్వడం వల్లే కొంత అయోమయం నెలకొంటుంది.
గత సినిమాల అత్యధిక వసూళ్లను దాటినవి మొదటి క్యాటగిరీ అయితే ఎక్కువ కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ చేసుకున్నవి రెండో విభాగం. సింహాద్రి ఇది రిలీజైన 2003 నాటికి ఇక్కడ చెప్పిన వాటిలో సెకండ్ జోన్ లోకి వస్తుంది. ఎలా చూసుకున్నా టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో దీనికి చోటున్న మాట వాస్తవం. చాలా సెంటర్స్ లో హయ్యెస్ట్ నెంబర్స్ నమోదు చేయడం గురించి నిర్మాత వి దొరస్వామిరాజు పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెప్పారు. ఏ సినిమాకైనా కలెక్షన్ల లెక్కలన్నీ నిజమేనని చెప్పడానికి పక్కా ఆధారాలు ఉండవు. ఆలా అని సింహాద్రి విజయాన్ని ఏ కోణంలోనూ తక్కువ చేయడానికి లేదు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…