ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో వరుసగా రెండు బ్లాక్బస్టర్లు ఇవ్వడం అరుదైన విషయం అయిపోయింది. అందులోనూ డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో భారీ విజయాలను అందుకుంటే చర్చనీయాంశంగా మారకుండా ఎలా ఉంటుంది? మాస్ రాజా రవితేజ విషయంలో అదే జరిగింది. గత ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్లు కావడంతో ఆయన పని అయిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా ‘రామారావు’ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం.. అది పూర్తిగా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోవడంతో రవితేజ మార్కెట్ దారుణంగా దెబ్బ తినేసినట్లు కనిపించింది. కానీ అందరికీ పెద్ద షాకిస్తూ ఏడాది చివర్లో ‘ధమాకా’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ. ఈ సినిమాకు అంత మంచి టాక్ ఏమీ రాకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనూహ్యమైన నంబర్స్ నమోదయ్యాయి. తర్వాత మూడు వారాలకే ప్రత్యేక పాత్ర చేసిన ‘వాల్తేరు వీరయ్య’తోనూ మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు మాస్ రాజా.
డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో ఇంత తక్కువ గ్యాప్లో భారీ విజయాలు అందుకునేసరికి రవితేజకు దిష్టి తగిలేసినట్లుంది. ఆయన కొత్త సినిమా ‘రావణాసుర’కు ఎందుకో సరైన హైప్ రాలేదు. సినిమాకు వచ్చిన టాక్.. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. తొలి రోజు ‘రావణాసుర’ రూ.5 కోట్ల దాకా షేర్ రాబట్టగా.. రెండో రోజు అందులో వసూళ్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఆదివారం ఓ మోస్తరుగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ మొత్తానికి ఈ సినిమా షేర్ రూ.10 కోట్ల వరకు ఉండొచ్చు.
సినిమాకు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో సోమవారం నుంచి నిలబడ్డం కష్టమే. ‘ధమాకా’ తొలి వీకెండ్లో రాబట్టిన వసూళ్లతో పోలిస్తే ‘రావణాసుర’ కలెక్షన్లు సగం మాత్రమే వచ్చేలా ఉన్నాయి. అనుకోకుండా రవితేజ ఖాతాలో రెండు బ్లాక్బస్టర్లు పడేసరికి ఆయనకు దిష్టి తగిలేసినట్లుందని.. రాబోయే సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’తో మాస్ రాజా గట్టిగా కొడతాడని అభిమానులు అంటున్నారు. నిజానికి ‘రావణాసుర’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందని రవితేజకు కూడా పెద్దగా ఆశలు లేవన్నది సన్నిహితుల సమాచారం.
This post was last modified on April 9, 2023 10:01 pm
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…