ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో వరుసగా రెండు బ్లాక్బస్టర్లు ఇవ్వడం అరుదైన విషయం అయిపోయింది. అందులోనూ డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో భారీ విజయాలను అందుకుంటే చర్చనీయాంశంగా మారకుండా ఎలా ఉంటుంది? మాస్ రాజా రవితేజ విషయంలో అదే జరిగింది. గత ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్లు కావడంతో ఆయన పని అయిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా ‘రామారావు’ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం.. అది పూర్తిగా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోవడంతో రవితేజ మార్కెట్ దారుణంగా దెబ్బ తినేసినట్లు కనిపించింది. కానీ అందరికీ పెద్ద షాకిస్తూ ఏడాది చివర్లో ‘ధమాకా’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రవితేజ. ఈ సినిమాకు అంత మంచి టాక్ ఏమీ రాకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనూహ్యమైన నంబర్స్ నమోదయ్యాయి. తర్వాత మూడు వారాలకే ప్రత్యేక పాత్ర చేసిన ‘వాల్తేరు వీరయ్య’తోనూ మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు మాస్ రాజా.
డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో ఇంత తక్కువ గ్యాప్లో భారీ విజయాలు అందుకునేసరికి రవితేజకు దిష్టి తగిలేసినట్లుంది. ఆయన కొత్త సినిమా ‘రావణాసుర’కు ఎందుకో సరైన హైప్ రాలేదు. సినిమాకు వచ్చిన టాక్.. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. తొలి రోజు ‘రావణాసుర’ రూ.5 కోట్ల దాకా షేర్ రాబట్టగా.. రెండో రోజు అందులో వసూళ్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఆదివారం ఓ మోస్తరుగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ మొత్తానికి ఈ సినిమా షేర్ రూ.10 కోట్ల వరకు ఉండొచ్చు.
సినిమాకు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో సోమవారం నుంచి నిలబడ్డం కష్టమే. ‘ధమాకా’ తొలి వీకెండ్లో రాబట్టిన వసూళ్లతో పోలిస్తే ‘రావణాసుర’ కలెక్షన్లు సగం మాత్రమే వచ్చేలా ఉన్నాయి. అనుకోకుండా రవితేజ ఖాతాలో రెండు బ్లాక్బస్టర్లు పడేసరికి ఆయనకు దిష్టి తగిలేసినట్లుందని.. రాబోయే సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’తో మాస్ రాజా గట్టిగా కొడతాడని అభిమానులు అంటున్నారు. నిజానికి ‘రావణాసుర’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందని రవితేజకు కూడా పెద్దగా ఆశలు లేవన్నది సన్నిహితుల సమాచారం.
This post was last modified on April 9, 2023 10:01 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…