Movie News

పారితోషకాలపై రాధిక మార్కు కామెంట్

సినీ రంగంలో ఆడ, మగ సమానత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. ఎవరు ఔనన్నా కాదన్నా సినీ రంగంలో పురుషాధిక్యత ఎక్కువ అనడంలో సందేహం లేదు. సంఖ్యా పరంగా చూసుకున్నా.. సంపాదన కోణంలో చూసినా మగాళ్లదే తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తుంది ఇక్కడ. ఐతే గతంతో పోలిస్తే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. వారి ఆదాయం కూడా పెరుగుతోంది. అయినా సరే.. మగాళ్లతో పోలిస్తే అంతరం చాలా కనిపిస్తుంది. ఈ తేడాలపై కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

డిమాండ్ ఉన్న కథానాయికలు పారితోషకాలు ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు. కానీ అందరికీ ఆ స్కోప్ ఉండదు. చాలామంది ఈ వివక్షపై నోరు విప్పరు కానీ.. కొందర మాత్రం ఓపెన్ అవుతుంటారు. బాలీవుడ్లో చేసే పాత్రల విషయంలోనే కాక మాటల్లోనూ బోల్డ్‌నెస్ చూపించే రాధికా ఆప్టే.. తాజాగా సినీ రంగంలో మహిళలకు తక్కువ ప్రాధాన్యం, పారితోషకాలు ఇవ్వడంపై స్పందించింది.

సినీ రంగంలో హీరోయిన్లతో పాటు ఇక్కడ పని చేసే మహిళలు అందరికీ.. పురుషులతో సమానంగా పారితోషకాలు ఉండాలని ఆమె అభిప్రాయపడింది. డబ్బుతో పాటు పేరు కూడా మహిళలకు పురుషులతో సమానంగా దక్కాలని డిమాండ్ చేసింది. గతంతో పోలిస్తే పరిస్థితులు మారాయని.. ఈ రంగంలో పురుషులతో సమానంగా నిలబడేందుకు మహిళలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయమని అంది.

ప్రస్తుతం అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెరుగుతున్నాయని.. మహిళల పాత్రలకు ప్రాధాన్యం దక్కుతోందని.. ఇది శుభ పరిణామమని రాధిక పేర్కొంది. ఇతర రంగాల్లోనూ ఆడ, మగ అంటే తేడా లేదు అనే భావన పెరుగుతోందని.. మహిళలు అన్ని విధాలుగా సమానత్వం కోసం పోరాడుతున్నారని.. ఆ మార్పు మంచిదే అని రాధిక అంది.

This post was last modified on April 9, 2023 5:18 pm

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

13 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

56 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago