సినీ రంగంలో ఆడ, మగ సమానత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. ఎవరు ఔనన్నా కాదన్నా సినీ రంగంలో పురుషాధిక్యత ఎక్కువ అనడంలో సందేహం లేదు. సంఖ్యా పరంగా చూసుకున్నా.. సంపాదన కోణంలో చూసినా మగాళ్లదే తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తుంది ఇక్కడ. ఐతే గతంతో పోలిస్తే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. వారి ఆదాయం కూడా పెరుగుతోంది. అయినా సరే.. మగాళ్లతో పోలిస్తే అంతరం చాలా కనిపిస్తుంది. ఈ తేడాలపై కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
డిమాండ్ ఉన్న కథానాయికలు పారితోషకాలు ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు. కానీ అందరికీ ఆ స్కోప్ ఉండదు. చాలామంది ఈ వివక్షపై నోరు విప్పరు కానీ.. కొందర మాత్రం ఓపెన్ అవుతుంటారు. బాలీవుడ్లో చేసే పాత్రల విషయంలోనే కాక మాటల్లోనూ బోల్డ్నెస్ చూపించే రాధికా ఆప్టే.. తాజాగా సినీ రంగంలో మహిళలకు తక్కువ ప్రాధాన్యం, పారితోషకాలు ఇవ్వడంపై స్పందించింది.
సినీ రంగంలో హీరోయిన్లతో పాటు ఇక్కడ పని చేసే మహిళలు అందరికీ.. పురుషులతో సమానంగా పారితోషకాలు ఉండాలని ఆమె అభిప్రాయపడింది. డబ్బుతో పాటు పేరు కూడా మహిళలకు పురుషులతో సమానంగా దక్కాలని డిమాండ్ చేసింది. గతంతో పోలిస్తే పరిస్థితులు మారాయని.. ఈ రంగంలో పురుషులతో సమానంగా నిలబడేందుకు మహిళలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయమని అంది.
ప్రస్తుతం అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెరుగుతున్నాయని.. మహిళల పాత్రలకు ప్రాధాన్యం దక్కుతోందని.. ఇది శుభ పరిణామమని రాధిక పేర్కొంది. ఇతర రంగాల్లోనూ ఆడ, మగ అంటే తేడా లేదు అనే భావన పెరుగుతోందని.. మహిళలు అన్ని విధాలుగా సమానత్వం కోసం పోరాడుతున్నారని.. ఆ మార్పు మంచిదే అని రాధిక అంది.
This post was last modified on April 9, 2023 5:18 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…