సినీ రంగంలో ఆడ, మగ సమానత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. ఎవరు ఔనన్నా కాదన్నా సినీ రంగంలో పురుషాధిక్యత ఎక్కువ అనడంలో సందేహం లేదు. సంఖ్యా పరంగా చూసుకున్నా.. సంపాదన కోణంలో చూసినా మగాళ్లదే తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తుంది ఇక్కడ. ఐతే గతంతో పోలిస్తే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. వారి ఆదాయం కూడా పెరుగుతోంది. అయినా సరే.. మగాళ్లతో పోలిస్తే అంతరం చాలా కనిపిస్తుంది. ఈ తేడాలపై కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
డిమాండ్ ఉన్న కథానాయికలు పారితోషకాలు ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు. కానీ అందరికీ ఆ స్కోప్ ఉండదు. చాలామంది ఈ వివక్షపై నోరు విప్పరు కానీ.. కొందర మాత్రం ఓపెన్ అవుతుంటారు. బాలీవుడ్లో చేసే పాత్రల విషయంలోనే కాక మాటల్లోనూ బోల్డ్నెస్ చూపించే రాధికా ఆప్టే.. తాజాగా సినీ రంగంలో మహిళలకు తక్కువ ప్రాధాన్యం, పారితోషకాలు ఇవ్వడంపై స్పందించింది.
సినీ రంగంలో హీరోయిన్లతో పాటు ఇక్కడ పని చేసే మహిళలు అందరికీ.. పురుషులతో సమానంగా పారితోషకాలు ఉండాలని ఆమె అభిప్రాయపడింది. డబ్బుతో పాటు పేరు కూడా మహిళలకు పురుషులతో సమానంగా దక్కాలని డిమాండ్ చేసింది. గతంతో పోలిస్తే పరిస్థితులు మారాయని.. ఈ రంగంలో పురుషులతో సమానంగా నిలబడేందుకు మహిళలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయమని అంది.
ప్రస్తుతం అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెరుగుతున్నాయని.. మహిళల పాత్రలకు ప్రాధాన్యం దక్కుతోందని.. ఇది శుభ పరిణామమని రాధిక పేర్కొంది. ఇతర రంగాల్లోనూ ఆడ, మగ అంటే తేడా లేదు అనే భావన పెరుగుతోందని.. మహిళలు అన్ని విధాలుగా సమానత్వం కోసం పోరాడుతున్నారని.. ఆ మార్పు మంచిదే అని రాధిక అంది.
This post was last modified on April 9, 2023 5:18 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…