ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘రాధే శ్యామ్’ కంటే కూడా దీని తర్వాత అతను చేయబోయే కొత్త చిత్రం మీదే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉందంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే.. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ సినిమాతో అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రభాస్ లాంటి మాస్ హీరో అశ్విన్ లాంటి క్లాస్ డైరెక్టర్తో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుడితే ఆసక్తికి కొదవేముంది.
ఈ మధ్యే ఈ చిత్ర బృందం ఓ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతోందన్నదే ఆ అప్ డేట్. ప్రభాస్-దీపిక జోడీ కడితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. నిజమైన పాన్ ఇండియా అప్పీల్ వస్తుందీ చిత్రానికి.
ఐతే ఈ సినిమా గురించి వార్త రాసిన ఓ న్యూస్ పోర్టల్ దాన్ని ‘ప్రభాస్ 21’గా పేర్కొనడం పట్ల దీపిక కాస్త ఉడుక్కున్నట్లుగా కనిపించే సరికి ప్రభాస్ విషయంలో ఆమె ఇన్ సెక్యూర్ ఫీలింగ్తో ఉందనిపించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ చిత్రంలో మరో కథానాయికకు కూడా చోటున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో తన ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుందేమో అని దీపిక ఫీల్ కావచ్చని అంటున్నారు.
కాకపోతే దీపికనే లీడ్ హీరోయిన్ అని.. మరో కథానాయిక పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని.. దీపికలా పెద్ద కథానాయికను కాకుండా ఓ కుర్ర హీరోయిన్ని తీసుకుంటారని అంటున్నారు. త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో వెల్లడిస్తారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ అని.. ‘ఆదిత్య 369’ తరహాలో సాగుతుందని.. ‘క్రిష్’ స్టయిల్లో ఉంటుందని.. ఇంకా ఏవేవో ప్రచారాలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ కథ అయితే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్ల దాకా ఉండొచ్చని సమాచారం.
This post was last modified on August 2, 2020 9:54 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…