ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘రాధే శ్యామ్’ కంటే కూడా దీని తర్వాత అతను చేయబోయే కొత్త చిత్రం మీదే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉందంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే.. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ సినిమాతో అతడిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రభాస్ లాంటి మాస్ హీరో అశ్విన్ లాంటి క్లాస్ డైరెక్టర్తో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుడితే ఆసక్తికి కొదవేముంది.
ఈ మధ్యే ఈ చిత్ర బృందం ఓ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతోందన్నదే ఆ అప్ డేట్. ప్రభాస్-దీపిక జోడీ కడితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. నిజమైన పాన్ ఇండియా అప్పీల్ వస్తుందీ చిత్రానికి.
ఐతే ఈ సినిమా గురించి వార్త రాసిన ఓ న్యూస్ పోర్టల్ దాన్ని ‘ప్రభాస్ 21’గా పేర్కొనడం పట్ల దీపిక కాస్త ఉడుక్కున్నట్లుగా కనిపించే సరికి ప్రభాస్ విషయంలో ఆమె ఇన్ సెక్యూర్ ఫీలింగ్తో ఉందనిపించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ చిత్రంలో మరో కథానాయికకు కూడా చోటున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో తన ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుందేమో అని దీపిక ఫీల్ కావచ్చని అంటున్నారు.
కాకపోతే దీపికనే లీడ్ హీరోయిన్ అని.. మరో కథానాయిక పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని.. దీపికలా పెద్ద కథానాయికను కాకుండా ఓ కుర్ర హీరోయిన్ని తీసుకుంటారని అంటున్నారు. త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో వెల్లడిస్తారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ అని.. ‘ఆదిత్య 369’ తరహాలో సాగుతుందని.. ‘క్రిష్’ స్టయిల్లో ఉంటుందని.. ఇంకా ఏవేవో ప్రచారాలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ కథ అయితే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్ల దాకా ఉండొచ్చని సమాచారం.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…