కొత్త సినిమాల ఫలితాలు ఈ మధ్య అంచనాలకు తగ్గట్టూనే నమోదవుతున్నాయి. విడుదలకు ముందున్న వాతావరణం, బజ్ ని ప్రతిబింబిస్తూ వసూళ్లు వస్తున్నాయి. మొన్న శుక్రవారం వచ్చిన రిలీజులు రెండు పాఠాలు నేర్పించాయి. మొదటిది రావణాసుర. రవితేజ లాంటి మాస్ హీరోని ఏదో కొత్తగా చూపించాలని తాపత్రయపడి కిల్లర్ గా మార్చి రివెంజ్ డ్రామాని జోడించడం వల్ల మాస్ కి కనెక్ట్ కాలేమని మొదటి రోజే అర్థమైపోయింది. మాస్ మహారాజా ఇమేజ్ వల్ల అయిదు కోట్లకు దగ్గరగా ఓపెనింగ్ ఫిగర్ వచ్చింది కానీ ఆదివారం తర్వాత ఎలాంటి అద్భుతాలు జరిగే అవకాశం లేనట్టే.
ఓటిటిలో ఇలాంటి క్రైమ్ కథలను బోలెడు చూస్తున్న ఆడియన్స్ కి రావణాసుర లాంటివి చాలా మాములుగా అనిపిస్తాయి. పైగా ఆల్బమ్ కూడా నెగటివ్ కావడం డ్యామేజ్ ని ఇంకా పెంచింది. రెండోది మీటర్. ఏ హీరో అయినా తన బలాలు బలహీనతలు చూసుకోకుండా కమర్షియల్ జానర్ లోకి బలవంతంగా జొరబడాలని చూస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో కిరణ్ అబ్బవరంకు ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది. మొదటి రోజే డెఫిషిట్లు పడటం, హైదరాబాద్ లాంటి నగరంలోనూ రెండో రోజు షోలు క్యాన్సిల్ కావడం మాములు షాక్ కాదు. కనీస మద్దతు దక్కలేదు.
జరిగిన అతి తక్కువ థియేట్రికల్ బిజినెస్ లోనూ సగం కూడా అందుకునేలా లేకపోవడం మీటర్ ని పెద్ద డిజాస్టర్స్ లిస్టులోకి చేర్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్నున్నాయి. స్టార్లను ఎప్పుడూ ఓవర్ సీరియస్ గా చూపించకూడదు. పాటల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం మొదటి రోజే ఉంటుంది. కుర్ర హీరోలు తమకు సూటయ్యే క్యారెక్టర్ల పట్ల శ్రద్ధ వహించాలే తప్ప దర్శకుడు ఎగ్జైట్ అయ్యేలా చెప్పాడని టెంప్ట్ అయితే మాత్రం ఉన్న మార్కెట్ గోవిందా కొట్టేస్తుంది. ఈ వారం శాకుంతలం, రుద్రుడు, విడుదల పార్ట్ 1 జాతకాలు ఎలా ఉండబోతున్నాయో.
This post was last modified on April 9, 2023 5:19 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…