Movie News

సోషల్ మీడియా ముసుగులో ఫ్యాన్స్ రచ్చ

హీరోల ఫ్యాన్స్ అభిమానం రాను రాను ముదిరి పాకాన పడుతోంది. సోషల్ మీడియాలో ఫేక్ ఐడిలతో అవతలి వాళ్ళను గేలి చేయడమే టార్గెట్ గా పెట్టుకుని పరస్పరం కవ్వించుకునే పనిలేని బ్యాచులు పెరిగిపోతున్నాయి. నిన్న అల్లు అర్జున పుట్టినరోజు సందర్భంగా చిరంజీవితో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరూ ట్విట్టర్ లో విష్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లకు సమాధానం చెప్పే విషయంలో బన్నీ సమయపాలన కొంచెం అటుఇటు అయ్యింది. అంతే దానికి నానార్ధాలు తీసి ట్రోలింగ్ మొదలుపెట్టారు సదరు యాంటీ ఫ్యాన్స్.

చిరంజీవికి లేట్ గా బదులిచ్చాడని, తారక్ ని బావాని సంబోధించి పార్టీకి వస్తానని చెప్పాడని, చరణ్ ని కేవలం స్వీట్ బ్రదర్ అని సరిపుచ్చాడని ఇలా రకరకాల కారణాలతో నిందారోపణలు చేయడం మొదలుపెట్టారు. మెగా అల్లు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం గురించి గత కొన్ని నెలలుగా ఏవేవో ప్రచారాలు జరుగుతూనే వచ్చాయి. అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ రావడం, తన ప్రసంగంతో ఆకట్టుకోవడం, అల్లు అర్జున్ తదితరులంతా ఎంజాయ్ చేయడం ఇవన్నీ అందరూ యూట్యూబ్ వీడియోల సాక్షిగా చూసినవే.

అలీతో సరదాగా ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ విషయం మీద క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా అభిమానులు వీటితో సంతృప్తి చెందడం లేదు. బన్నీ మునుపటిలా లేడని మెగా ఫ్యాన్స్ అంటుంటే, లేదు చరణ్ వైపు నుంచే సమస్య ఉందని ఐకాన్ ఫాలోయర్స్ ఫిర్యాదు. వాస్తవం ఎవరికీ తెలియదు. వీళ్లందరి అభిప్రాయాలు తప్పయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు నిజాలు తెలియకుండానే ఇలా తొందపాటుతో ట్విట్టర్ లో కవ్వించుకునే ప్రయత్నాలు చేయడం సబబు కాదు. ఇదంతా అర్థం చేసుకునే పరిణితి ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది.

This post was last modified on April 9, 2023 10:53 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

11 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

48 minutes ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago