సమంతతో గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజవుతుంది. మైథాలాజికల్ స్టోరీతో సామ్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టి కొచ్చి , ముంబై , చెన్నై , బెంగళూర్ టూర్లు తిరుగుతున్నారు. టీంతో కలిసి సామ్ ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటుంది. అయితే శాకుంతలం కి రావలసిన బజ్ మాత్రం దక్కడం లేదు।
టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ఇలా ఏవి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీంతో ఇప్పుడు గుణ శేఖర్ , దిల్ రాజు సక్సెస్ ఐడియాను వెతుక్కుంటూ ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో ఉన్నారు. మేజర్ , రైటర్ పద్మభూషణ్ , బలగం ఇలా ఈ మధ్య చాలా హిట్ సినిమాలను ప్రేక్షకులకు ముందే చూపించారు. అంతెందుకు సార్ విషయంలో కూడా ప్రీమియర్ ప్లాన్ వర్కవుట్ అయింది.
దీంతో నాలుగు రోజుల ముందే సినిమాను మీడియాకి చూపించి ఒకరోజు ముందే ప్రేక్షకులకు పెయిడ్ ప్రీమియర్స్ వేసే ప్లాన్ రెడీ చేస్తున్నారు. మీడియాకి సినిమా ముందే చూపించడం ద్వారా సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే పెయిడ్ ప్రీమియర్ షో రెస్పాన్స్ తో ఓపెనింగ్స్ ఊపందుకునే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శాకుంతలం ను ముందే చూపించబోతున్నారట. మరో రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on April 9, 2023 10:54 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…