సమంతతో గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజవుతుంది. మైథాలాజికల్ స్టోరీతో సామ్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టి కొచ్చి , ముంబై , చెన్నై , బెంగళూర్ టూర్లు తిరుగుతున్నారు. టీంతో కలిసి సామ్ ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటుంది. అయితే శాకుంతలం కి రావలసిన బజ్ మాత్రం దక్కడం లేదు।
టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ఇలా ఏవి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీంతో ఇప్పుడు గుణ శేఖర్ , దిల్ రాజు సక్సెస్ ఐడియాను వెతుక్కుంటూ ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో ఉన్నారు. మేజర్ , రైటర్ పద్మభూషణ్ , బలగం ఇలా ఈ మధ్య చాలా హిట్ సినిమాలను ప్రేక్షకులకు ముందే చూపించారు. అంతెందుకు సార్ విషయంలో కూడా ప్రీమియర్ ప్లాన్ వర్కవుట్ అయింది.
దీంతో నాలుగు రోజుల ముందే సినిమాను మీడియాకి చూపించి ఒకరోజు ముందే ప్రేక్షకులకు పెయిడ్ ప్రీమియర్స్ వేసే ప్లాన్ రెడీ చేస్తున్నారు. మీడియాకి సినిమా ముందే చూపించడం ద్వారా సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే పెయిడ్ ప్రీమియర్ షో రెస్పాన్స్ తో ఓపెనింగ్స్ ఊపందుకునే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శాకుంతలం ను ముందే చూపించబోతున్నారట. మరో రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…