సమంతతో గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజవుతుంది. మైథాలాజికల్ స్టోరీతో సామ్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టి కొచ్చి , ముంబై , చెన్నై , బెంగళూర్ టూర్లు తిరుగుతున్నారు. టీంతో కలిసి సామ్ ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటుంది. అయితే శాకుంతలం కి రావలసిన బజ్ మాత్రం దక్కడం లేదు।
టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ఇలా ఏవి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీంతో ఇప్పుడు గుణ శేఖర్ , దిల్ రాజు సక్సెస్ ఐడియాను వెతుక్కుంటూ ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో ఉన్నారు. మేజర్ , రైటర్ పద్మభూషణ్ , బలగం ఇలా ఈ మధ్య చాలా హిట్ సినిమాలను ప్రేక్షకులకు ముందే చూపించారు. అంతెందుకు సార్ విషయంలో కూడా ప్రీమియర్ ప్లాన్ వర్కవుట్ అయింది.
దీంతో నాలుగు రోజుల ముందే సినిమాను మీడియాకి చూపించి ఒకరోజు ముందే ప్రేక్షకులకు పెయిడ్ ప్రీమియర్స్ వేసే ప్లాన్ రెడీ చేస్తున్నారు. మీడియాకి సినిమా ముందే చూపించడం ద్వారా సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే పెయిడ్ ప్రీమియర్ షో రెస్పాన్స్ తో ఓపెనింగ్స్ ఊపందుకునే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శాకుంతలం ను ముందే చూపించబోతున్నారట. మరో రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on April 9, 2023 10:54 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…