టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథలు కానీ.. సన్నివేశాలు కానీ.. ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయి. ఆయనతో పని చేసిన వాళ్లు చెప్పే దాని ప్రకారం.. ఒక సన్నివేశం రాసేటపుడు, తీసేటపుడు.. లేదా ఒక డైలాగ్ రాసేటపుడు.. ప్రేక్షకులు ఏం అంచనా వేస్తారు అని ఆలోచించి.. దానికి భిన్నంగా ఆయన రాత, తీత ఉంటుందని అంటారు. సుకుమార్ ఏం చేసినా.. ప్రేక్షకుల ఆలోచనలకు కొన్ని అడుగులు ముందే ఉంటారని చెబుతారు. ‘పుష్ప’ సినిమాలో హీరో సహా ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విషయంలోనూ ఆయన మార్కు స్పష్టంగా కనిపించింది.
పుష్ప పాత్రకు సంబంధించి నెగెటివ్ షేడ్స్ విషయంలో కాస్త మిశ్రమ స్పందన వచ్చినా.. మెజారిటీ ప్రేక్షకులకు ఆ పాత్ర మంచి కిక్కు ఇచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి పాత్రలను రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దుతుంటారు. దొరల్ని కొట్టి పేదలకు పంచడం అనే ఫార్మాట్ ఫాలో అయిపోతుంటారు.
కానీ ‘పుష్ప: ది రైజ్’లో మాత్రం హీరో పాత్ర అలా కనిపించలేదు. పూర్తిగా తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే పాత్రలా కనిపించాడు పుష్పరాజ్. అతడిలోని హ్యూమన్ యాంగిల్ ఎక్కడా కనిపించలేదు. ఒక స్మగ్లర్ను హీరోగా చూపించడం ఏంటి అంటూ గరికపాటి నరసింహారావు లాంటి వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. మెజారిటీ ప్రేక్షకులు ఇవేమీ పట్టించుకోలేదు. స్మగ్లింగ్ ద్వారా డబ్బులు సంపాదించి.. లేని వాళ్లకు సాయం చేసినట్లు చూపిస్తే ఆ పాత్ర రొటీన్ అయిపోతుందని.. అలా లేకపోవడమే పాత్రకు వైవిధ్యాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు ఈ వర్గం ప్రేక్షకులంతా. కానీ ‘పుష్ప: ది రూల్’ దగ్గరికి వచ్చేసరికి సుకుమార్ కూడా అందరి దారిలోనే నడిచాడు.
టీజర్లో పుష్ప ద్వారా సాయాలు పొందిన వాళ్లందరూ అతను కనిపించకపోయేసరికి ఆందోళన చెందుతూ తన గురించి గొప్పగా చెప్పిన షాట్స్ చూపించారు. దీంతో సెకండ్ పార్ట్లో పుష్ప పాత్ర తీరు ఎలా ఉండబోతుందో ఒక అంచనా వచ్చేసింది. సుక్కు నుంచి వైవిధ్యం కోరుకునే వారికి ఇది కొంచెం నిరాశ కలిగించిన విషయమే అని చెప్పాలి.
This post was last modified on April 8, 2023 10:47 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…