‘ఊహలు గుసగుసలాడే’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. ఆమె అరంగేట్ర సినిమా చిన్నదే కానీ.. అది సాధించిన విజయం పెద్దదే. ఆ సినిమాలో ముగ్ధమనోహరంగా కనిపించిన రాశిని చూసి చాలామంది కుర్రాళ్లు ప్రేమలో పడిపోయారు. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు భిన్నంగా కొంచెం బొద్దుగా, ముద్దుగా కనిపించిన రాశి.. కుర్రా కారు గుండెలకు బాగానే గాయం చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో ఆమెకు బాగానే అవకాశాలు వచ్చాయి.
‘బెంగాల్ టైగర్’ సహా కొన్ని సినిమాల్లో సూపర్ సెక్సీగానూ కనిపించి గ్లామర్ ప్రియులనూ ఆకట్టుకుందామె. ‘తొలి ప్రేమ’ సినిమాతో పెర్ఫామర్గానూ తనేంటో రుజువు చేసుకుంది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని.. టాప్ హీరోల సరసన కూడా అవకాశాలు పట్టేస్తుందని అంచనా వేశారు ఇండస్ట్రీ నిపుణులు.
కానీ ఆశ్చర్యకరంగా రాశి కెరీర్ తిరోగమనంలో పయనించింది. టాలీవుడ్లో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. పెద్ద రేంజికి వెళ్తుందనుకున్న హీరోయిన్ కాస్తా.. తెలుగులో అసలు అవకాశాలే లేని స్థాయికి రావడం రాశి అభిమానులను బాధించే విషయమే. రాశి కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టి తొమ్మిదేళ్లు పూర్తి కావస్తుండగా.. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆమె అందం, ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. కెరీర్లో ఒక దశ వరకు బొద్దుగా ఉందన్న విమర్శలకు సమాధానం చెబుతూ.. మధ్యలో బరువు కూడా తగ్గింది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిజిక్తో మెస్మరైజింగ్గా కనిపిస్తోంది.
రాశి ఇతర భాషల్లో చేస్తున్న పాత్రలు, ఆమె అప్పీయరెన్స్ చూసి తెలుగు ప్రేక్షకులు ఒకింత విచారిస్తున్నారు. ముఖ్యంగా ‘ఫర్జీ’ సిరీస్లో అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది రాశి. ఆమెను అలాంటి పాత్రల్లో చూసి ఇంతందం దారి మళ్లిందే.. అని తెలుగు ప్రేక్షకులు ఫీలయ్యే పరిస్థితి. తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమంలో పింక్ కలర్ టాప్ డ్రెస్సులో రాశి మెరిసిపోయిన తీరు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇలాంటి కథానాయికను సరిగా ఉపయోగించుకోనందుకు టాలీవుడ్ దర్శక నిర్మాతల మీద కోపం వస్తోంది ఆమె అభిమానులకు.
This post was last modified on April 8, 2023 6:41 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…