గత వారం వచ్చిన ‘దసరా’ సినిమా వేసవి సీజన్కు ఘనమైన ఆరంభాన్నే ఇచ్చింది. ఇక ఈ వారం ఒకటికి రెండు సినిమాలు బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి సీనియర్ హీరో రవితేజ నటించిన ‘రావణాసుర’ కాగా.. ఇంకోటి యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్ర పోషించిన ‘మీటర్’. ఇందులో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది ‘రావణాసుర’నే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ రవితేజ అంటే పక్కా మాస్ మసాలా సినిమాలకు ప్రసిద్ధి. ఆయన కొంచెం రూటు మార్చి వైవిధ్యమైన కథలు ప్రయత్నిస్తే చాలా వరకు బెడిసికొట్టాయి. అయినా సరే.. ‘రావణాసుర’తో కొంచెం భిన్నమైన ప్రయత్నమే చేసినట్లున్నాడు. టైటిల్కు తగ్గట్లే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు రవితేజ ఇందులో.
టీజర్, ట్రైలర్ చూస్తే ‘రావణాసుర’ కథ మీద ఒక అంచనాకు రాలేని పరిస్థితి. కథేంటో పూర్తిగా అర్థం కాలేదు. దీన్ని సస్పెన్సులా దాచి ఉంచింది చిత్ర బృందం. మరి థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకుడికి ఏం వడ్డించబోతున్నారన్నది ఆసక్తికరం. తొలి చిత్రం ‘స్వామి రారా’ తర్వాత హిట్టు రుచే ఎరుగని సుధీర్ వర్మకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. చాన్నాళ్లు నిర్మాణానికి దూరంగా ఉన్న అభిషేక్ నామాతో పాటు రచయిత శ్రీకాంత్ విస్సా కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి ‘రావణాసుర’ వీళ్లందరికీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
ఇక ‘మీటర్’ సినిమా విషయానికి వస్తే.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుపోతున్న కిరణ్ రెడ్డికి కూడా ఇది సక్సెస్ కావడం అత్యావశ్యకం. దీని ట్రైలర్ చూస్తే మాత్రం సగటు మాస్ మసాలా సినిమాలా కనిపించింది. ‘దసరా’ ఇంకా బాగానే ఆడుతుండగా.. ‘రావణాసుర’ పోటీని కూడా తట్టుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ‘మీటర్’కు అంత తేలిక కాదు. కానీ కిరణ్ అండ్ కో చాలా ధీమాగా ఉన్నారు. కొత్త దర్శకుడు రమేష్ కడూరి ఈ చిత్రాన్ని రూపొందించాడు. మరి సీనియర్ వెర్సస్ జూనియర్ బాక్సాఫీస్ పోరులో ఎవరెలాంటి ఫలితాన్నందుకుంటారో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…