పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి ఫినిష్ చేసే దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే వినోదాయ సీతం రీమేక్ టాకీ కంప్లీట్ చేసేశాడు. తాజాగా హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో జాయిన్ అయిపోయాడు. ఈ సినిమాకు సంబంధించి ఒకటి రెండు షెడ్యూల్స్ తర్వాత సుజీత్ OG సినిమాకు డేట్స్ ఇవ్వబోతున్నాడు. ఇలా తన లైనప్ లో ఉన్న అన్నీ సినిమాలకు డేట్స్ ఇస్తూ ప్లాన్ చేసుకుంటున్న పవన్ హరి హర వీరమల్లు ను మాత్రం పట్టించుకోవడం లేదు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ మొదటి పాన్ ఇండియా మూవీగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతుంది. పవన్ రీ ఎంట్రీ ఇద్దామని ఫిక్స్ అయిన టైమ్ లో ముందుగా ఒకే చేసుకున్న కథల్లో ఇదొకటి. పీరియాడిక్ హిస్టారికల్ ఫిక్షనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కానీ మధ్యలో పవన్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల మరికొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఆ మధ్య పవన్ ఓ షెడ్యూల్ చేసే సరికి ఇక ఈ సినిమాను కంప్లీట్ చేశాకే మరో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు క్రిష్ తర్వాత ఎనౌన్స్ అయిన ప్రాజెక్ట్స్ థియేటర్స్ లోకి వచ్చేశాయి, మరికొన్ని అనుకోకుండా సెట్స్ పైకి వచ్చేసి కంప్లీట్ కూడా అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీలో అంతా అయ్యో పాపం క్రిష్ అనుకుంటూ పవన్ తో ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడేంటి ? అని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా పవన్ మిగతా సినిమాలతో పాటు హరి హర వీరమల్లు కి కూడా మధ్యలో డేట్స్ ఇస్తే కొంత కొంత ఘాట్ పూర్తవుతుంది. లేదంటే ఎన్నేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. పవన్ ఈ విషయం ఆలోచించుకోవాల్సిందే.
This post was last modified on April 6, 2023 7:04 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…