టాలీవుడ్ లో ఓ మంచి ఒరవడి ఉంది. తమ బేనర్ , తమకి సంబంధం లేకపోయినప్పటికీ కొన్ని ఉత్తమ సినిమాలను మెచ్చుకుంటూ ఆ టీంను సన్మానించడం చాలా సార్లు చూశాం. ముఖ్యంగా అల్లు అరవింద్ ఇలాంటి విషయాలో అందరికంటే ముందుంటారు. ‘శతమానం భవతి’ , ‘మహానటి’ సినిమాల రిలీజ్ తర్వాత టీం అందరినీ పిలిచి ఓ పార్టీ ఏర్పాటు చేసి, ఈవెంట్ నిర్వహించి వారిపై ప్రశంసలు కురిపించారు అల్లు అరవింద్. ఎలాంటి ఇగో లేకుండా అలా సన్మానించడంతో అల్లు మంచి మనసు గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు.
ఇప్పుడు దిల్ రాజు బేనర్ నుండి ‘బలగం’ అనే చిన్న సినిమా వచ్చింది. ఈ సినిమాకు నలుమూలల నుండి అభినందనలు, ప్రశంసలు దక్కాయి. దక్కుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ జనాలు కూడా ఈ సినిమా బృందాన్ని సన్మానించారు. ముఖ్యంగా చిరంజీవి తన భోళా శంకర్ సెట్స్ కి పిలిపించుకొని మరీ సన్మానించారు. ఆ తర్వాత మంచు మోహన్ బాబు మరికొందరు కూడా దర్శకుడు వేణును టీంను మెచ్చుకుంటూ సన్మానించారు.
అయితే బలగం విషయంలో అల్లు అరవింద్ మాత్రం కాస్త దూరంగా ఉండిపోయారు. ఈ చిన్న సినిమా సాదించిన పెద్ద విజయం గురించి ఎక్కడా మాట్లాడలేదు అల్లు. ఈ సినిమా టీంను ఎప్పటిలానే పిలిచి సన్మానించలేదు. దీనికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇటీవలే విజయ్ దేవరకొండ , పరశురామ్ కాంబో సినిమాను తమకి చెప్పకుండా దిల్ రాజు ఎనౌన్స్ చేశారని అల్లు అరవింద్ బాగా ఫీలయ్యారని ఓ న్యూస్ బయటికొచ్చింది. బహుశా అందుకే బలగం కి సంబంధించి అల్లు సైలెంట్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమా టీంను అల్లు అరవింద్ మెచ్చుకోకపోవడం ఎప్పటిలా ఓ సన్మానం ఏర్పాటు చేయకపోవడంతో అల్లుకి దిల్ కి మధ్య చెడిందని అర్థమవుతుంది.
This post was last modified on April 6, 2023 6:58 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…