మంచు మనోజ్ కు కోపం వచ్చింది. ఇవాళ జరిగిన ఒక ఈవెంట్ కి అతిథిగా వచ్సిన తరుణంలో మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు సంయమనం కోల్పోయి మాట జరగడం పలు విమర్శలకు దారి తీసింది. సినిమాలు చేసినా చేయకపోయినా మనోజ్ పట్ల ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ అటు అభిమానుల్లో ఇటు సాధారణ జనంలోనూ ఉంది. అలాంటిది అతను కంట్రోల్ తప్పడం విచిత్రమే. అయితే ఇలాంటి దూకుడు తనకు కొత్తేమీ కాదు. పలు సందర్భాల్లో అప్పుడప్పుడు మాట తూలినా అది పరిమిత హద్దుల్లోనే ఉంది. కానీ ఈసారి ఎందుకనో అదుపు తప్పేశాడు.
ఇటీవలే అన్నయ్య మంచు విష్ణు తన బంధువుల మీద దాడి చేసినట్టు మనోజ్ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అది డిలీట్ చేసే లోపు ట్విట్టర్ మొత్తం వైరల్ అయిపోయింది. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా డిబేట్లు పెట్టాయి. ఓసారి బయట కనిపించిన మనోజ్ ని ఇదే ప్రశ్న అడిగితే నాకంటే మీకే ఎక్కువ తెలుసంటూ తప్పించుకున్నాడు. కొద్దిరోజుల క్రితం విష్ణు ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేసి అదంతా ప్రాంకని త్వరలోనే రాబోయే రియాలిటీ సిరీస్ లో భాగంగా అది తీశామని చెప్పుకొచ్చాడు. దానికంత ప్రాధాన్యం దక్కలేదు అది వేరే విషయం.
మనోజ్ అన్న మాటలు నాకు సెగడ్డ వచ్చింది గొకండని మీడియాని ఉద్దేశించి చెప్పడం చూస్తే తెరవెనుక వ్యవహారం ఏదో ఉంది కాబట్టే ఇలా స్లిప్ అవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ప్రాంక్ అయితే దాన్ని ఒప్పేసుకుంటే ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. అదే విషయాన్ని మీడియా అతని ఫ్యాన్స్ కి చేరవేస్తుంది. కానీ అలా కాకుండా నవ్వుతూనే సెగ్గడ్డ ప్రస్తావన తేవడం మాత్రం టూ మచ్ అని అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వారు అంటున్నారు. ఏది ఏమైనా ప్రతిదీ వైరల్ అవుతున్న ట్రెండ్ లో అలోచించి మాట్లాడకపోతే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి.
This post was last modified on April 6, 2023 4:18 pm
రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా…
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…