Movie News

దేవరకొండ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టే

హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని , అసలు ఈ కాంబోలో ఓ బాలీవుడ్ సినిమా ఉండనుందని కానీ ఎవరూ ఊహించలేదు. అయితే తాజాగా ఈ ఇద్దరి కాంబోలో వార్ 2 ఎనౌన్స్ చేసి మేకర్స్ అందరినీ షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సర్ ప్రయిజ్ చేశారు. నిజానికి ఈ మధ్య కాలంలో హృతిక్ గురించి మాట్లాడుకుంటే అందులో వార్ టాపిక్ ముందుంటుంది. బాలీవుడ్ లో వార్ సినిమా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి బిగ్గెస్ట్ స్టైలిష్ యాక్షన్ గా మెప్పించింది.

ఆ సినిమాకు సీక్వెల్ అంటే అదీ ఎన్టీఆర్ కూడా ఉంటారంటే మూవీ లవర్స్ కి ఇంకేం కావాలి ? చెప్పండి. అయితే ఈ గోల్డెన్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కంటే ముందు యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతికి వచ్చిందట. లైగర్ షూటింగ్ టైమ్ లో హృతిక్ , విజయ్ కాంబోలో ఈ సీక్వెల్ సెట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి విజయ్ ను అప్రోచ్ అయ్యారట.

కానీ పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ డిజాస్టర్ అవ్వడంతో ఆ తర్వాత తెలుగు నుండి మరో స్టార్ కోసం చూస్తూ ఫైనల్ గా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో అక్కడ భారీ క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ ను లైన్లో పెట్టేసి తారక్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. అలా విజయ్ కి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు తారక చేతిలో పడింది.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

26 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago