దగ్గుబాటి రామానాయుడి తమ్ముడు… నిర్మాత సురేశ్ బాబు, హీరో వెంకటేశ్ల బాబాయి దగ్గుబాటి రామ్మోహనరావు అలియాస్ మోహన్ బాబు మరణించారు. అనారోగ్య కారణాలతో ఆయన సొంతూరు కారంచేడులో తుది శ్వాస విడిచారు. దగ్గుబాటి రామానాయుడు హైదరాబాద్ సహా చెన్నైలో వ్యాపారాల నిర్వహిస్తున్న సమయంలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన వ్యాపారాలను, వ్యవసాయాన్ని దగ్గుబాటి మోహన్ బాబు తన సొంత ఊరు కారంచేడులో ఉండి చూసుకునేవారు.
దగ్గుబాటి మోహన్ బాబు మృతి విషయం తెలుసుకుని హుటాహుటిన దగ్గుబాటి సురేష్ బాబు.. సినీ నటుడు, నిర్మాత దగ్గుబాటికి మేనల్లుడు అయిన అశోక్ బాబు, హీరో అభిరామ్ కారంచేడు వెళ్లారు. రేపు ఉదయం కారంచేడుకు సినీ హీరో వెంకటేష్, రానా కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, రానాలు వెల్లిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఇప్పటివరకు ఉన్న సమాచారం.
కాగా దగ్గుబాటి మోహన్ బాబుకు కూడా సినీరంగంలో అనుభవం ఉంది. ఒక చల్లని రాత్రి పేరుతో ఒక సినిమాను ఆయన నిర్మించారు. మరో రెండు చిత్రాలు కూడా ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో విడుదలయ్యాయి. చీరాలలో ఆయనకు ఒక థియేటర్ ఉంది. తన సోదరుడు రామానాయుడు కుమారులు, ఆ తరువాత తరం అయిన రానాతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
కాగా పెద్దగా వార్తల్లో, మీడియాలో దగ్గుబాటి మోహన్ బాబు పేరు కనిపించదు.. అయితే, ఇంతకుముందు 2019లో ఒకసారి ఆయన పేరు వినిపించింది. ఆ ఏడాది ఆయన ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. భారీగా బంగారం, నగలు పోయినట్లు అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి.
This post was last modified on April 5, 2023 6:23 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…