దగ్గుబాటి రామానాయుడి తమ్ముడు… నిర్మాత సురేశ్ బాబు, హీరో వెంకటేశ్ల బాబాయి దగ్గుబాటి రామ్మోహనరావు అలియాస్ మోహన్ బాబు మరణించారు. అనారోగ్య కారణాలతో ఆయన సొంతూరు కారంచేడులో తుది శ్వాస విడిచారు. దగ్గుబాటి రామానాయుడు హైదరాబాద్ సహా చెన్నైలో వ్యాపారాల నిర్వహిస్తున్న సమయంలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన వ్యాపారాలను, వ్యవసాయాన్ని దగ్గుబాటి మోహన్ బాబు తన సొంత ఊరు కారంచేడులో ఉండి చూసుకునేవారు.
దగ్గుబాటి మోహన్ బాబు మృతి విషయం తెలుసుకుని హుటాహుటిన దగ్గుబాటి సురేష్ బాబు.. సినీ నటుడు, నిర్మాత దగ్గుబాటికి మేనల్లుడు అయిన అశోక్ బాబు, హీరో అభిరామ్ కారంచేడు వెళ్లారు. రేపు ఉదయం కారంచేడుకు సినీ హీరో వెంకటేష్, రానా కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, రానాలు వెల్లిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఇప్పటివరకు ఉన్న సమాచారం.
కాగా దగ్గుబాటి మోహన్ బాబుకు కూడా సినీరంగంలో అనుభవం ఉంది. ఒక చల్లని రాత్రి పేరుతో ఒక సినిమాను ఆయన నిర్మించారు. మరో రెండు చిత్రాలు కూడా ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో విడుదలయ్యాయి. చీరాలలో ఆయనకు ఒక థియేటర్ ఉంది. తన సోదరుడు రామానాయుడు కుమారులు, ఆ తరువాత తరం అయిన రానాతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
కాగా పెద్దగా వార్తల్లో, మీడియాలో దగ్గుబాటి మోహన్ బాబు పేరు కనిపించదు.. అయితే, ఇంతకుముందు 2019లో ఒకసారి ఆయన పేరు వినిపించింది. ఆ ఏడాది ఆయన ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. భారీగా బంగారం, నగలు పోయినట్లు అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి.
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…