జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ రోజు ఉదయం బాలీవుడ్ నుంచి వచ్చిన అప్డేట్ చూసి తెగ ఖుషీ అయిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడిగా అవతరించిన తారక్.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ చేసినట్లే పూర్తి స్థాయి బాలీవుడ్ మూవీకి రెడీ అయిపోయాడు. అతను చేస్తున్న తొలి హిందీ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో కావడం.. వాళ్లు తీసే స్పై యూనివర్శ్ సినిమాల్లోకి తారక్ కూడా ఎంట్రీ ఇస్తుండటం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘వార్’ సీక్వెల్లో నటిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
హృతిక్ లాంటి హీరోను ఢీకొట్టే పాత్రలో మల్టీస్టారర్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇంత వరకు ఎగ్జైట్మెంట్ బాగానే ఉంది. కానీ హృతిక్ నటించే బాలీవుడ్ మూవీలో తారక్కు ప్రాధాన్యం ఏమాత్రం ఉంటుంది.. అతడికి దీటుగా తారక్ పాత్ర ఉంటుందా లేదా అనే చర్చ మొదలైపోయింది అప్పుడే. ఈ చర్చ మొదలవడానికి కారణాలు లేకపోలేదు.
‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, తారక్లకు సమవుజ్జీల్లాంటి పాత్రలనే రాజమౌళి తీర్చిదిద్దినప్పటికీ.. చరణ్ పాత్ర కొంచెం ఎక్కువ హైలైట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో తారక్ ఫ్యాన్స్ కొంత బాధపడ్డారు కూడా. పాత్రల ప్రాధాన్యం, ఎలివేషన్ల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ దశ నుంచే విపరీతమైన చర్చ జరగింది. ఈ నేపథ్యంలో ఇంకోసారి అలా ఎక్కువ, తక్కువ అనే చర్చ ఉండొద్దని తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే ‘వార్’ సినిమాలో హైలైట్ అయింది హృతిక్ క్యారెక్టరే. అతడిది హీరో పాత్రలా ఉండి.. టైగర్ ష్రాఫ్ది సహాయ పాత్రలా అనిపిస్తుంది.
‘వార్-2’లోనూ హృతిక్ పాత్రను అలాగే కొనసాగించి.. కొత్తగా తారక్ పాత్రను జోడిస్తారు. అలాంటపుడు ఫస్ట్ పార్ట్లో మాదిరే హృతిక్ ఎక్కువ హైలైట్ అయి.. తారక్ క్యారెక్టర్ దాని ముందు తగ్గితే పాత కథే పునరావృతం అవుతుంది. కాకపోతే ఇక్కడ తారక్కు చరణ్ సమాన స్థాయి హీరో, పైగా ఇరు వర్గాల అభిమానుల మధ్య వైరం ఉంది కాబట్టి ఇక్కడ అవసరానికి మించి చర్చ జరిగింది. బాలీవుడ్ సినిమానూ ఇదే కోణంలో చూస్తారని చెప్పలేం. పాత్రలు కొంచెం అటు ఇటుగా ఉన్నా.. తారక్కు ఉండాల్సిన ప్రయారిటీ తారక్కు ఉండాలన్నది అభిమానుల ఆకాంక్ష.
This post was last modified on April 5, 2023 2:09 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…