డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో అపజయాలు , విజయాలు అందుకున్న వెంకట రమణ రెడ్డి, వినాయక్ డైరెక్ట్ చేసిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి అక్కడి నుండి దిల్ రాజుగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘దిల్’ సినిమా రాజు గారి ఇంటి పేరుగా మారిపోయింది. అక్కడి నుండి ఇంతింతై వటుడింతతై అన్నట్టుగా అగ్ర నిర్మాతగా ఎదిగాడు దిల్ రాజు. అయితే దిల్ నుండి ఇప్పటి వరకూ ఎన్నో సుపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన దిల్ రాజు తన మొదటి హీరోకి మాత్రం ఆ తర్వాత ఒక్క సుపర్ హిట్ ఇవ్వలేకపోయాడు. దిల్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నితిన్ తో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేశాడు దిల్ రాజు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఇక మధ్యలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘దాగుడు మూతలు’ అనే సినిమా చేద్దామని ప్లాన్ చేసినా అదీ సెట్ పైకి వెళ్లలేదు.
దిల్ రాజు నిర్మాతగా మారి ఇరవై ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా తన ఇరవై ఏళ్ల కెరీర్ ను సెలెబ్రేట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇరవై ఏళ్ల నుండి నితిన్ కి ఓ బాకీ ఉండిపోయాననే బాధ కాస్త ఆయనలో ఉంది. ఇక అదే దిల్ తో తనను నిర్మాతగా మార్చిన వీ వీ వినాయక్ ను యాక్టర్ మార్చి సీనయ్య సినిమా చేద్దామని ప్లాన్ చేసిన దిల్ రాజు కి ఆ ప్రాజెక్ట్ కూడా సెట్ పైకి వెళ్ళకముందే క్యాన్సిల్ అయింది.
ఇలా తన మొదటి సినిమా హీరోకి , అలాగే మొదటి దర్శకుడికి ఇరవై ఏళ్ల నుండి బాకీ పడిపోయారు దిల్ రాజు. త్వరలోనే నితిన్ తో ఓ సినిమా నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. ఆ సినిమాతో నిర్మాతగా నితిన్ బాకీ తీర్చేస్తారేమో చూడాలి. ఇక వీవీ వినాయక్ బాకీ కూడా తొందర్లోనే తీరే అవకాశం కనిపిస్తుంది. కథ సెట్ అయితే మళ్ళీ ఈ కాంబోలో సినిమా రావొచ్చు. కానీ వీవీ వినాయక్ దర్శకుడిగా కాకుండా యాక్టర్ గా కనిపిస్తారు.
This post was last modified on April 5, 2023 11:26 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…