Movie News

దిల్ రాజు … ఇరవై ఏళ్ళ బాకీ !

డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో అపజయాలు , విజయాలు అందుకున్న వెంకట రమణ రెడ్డి, వినాయక్ డైరెక్ట్ చేసిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి అక్కడి నుండి దిల్ రాజుగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘దిల్’ సినిమా రాజు గారి ఇంటి పేరుగా మారిపోయింది. అక్కడి నుండి ఇంతింతై వటుడింతతై అన్నట్టుగా అగ్ర నిర్మాతగా ఎదిగాడు దిల్ రాజు. అయితే దిల్ నుండి ఇప్పటి వరకూ ఎన్నో సుపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన దిల్ రాజు తన మొదటి హీరోకి మాత్రం ఆ తర్వాత ఒక్క సుపర్ హిట్ ఇవ్వలేకపోయాడు. దిల్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నితిన్ తో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేశాడు దిల్ రాజు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఇక మధ్యలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘దాగుడు మూతలు’ అనే సినిమా చేద్దామని ప్లాన్ చేసినా అదీ సెట్ పైకి వెళ్లలేదు.

దిల్ రాజు నిర్మాతగా మారి ఇరవై ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా తన ఇరవై ఏళ్ల కెరీర్ ను సెలెబ్రేట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇరవై ఏళ్ల నుండి నితిన్ కి ఓ బాకీ ఉండిపోయాననే బాధ కాస్త ఆయనలో ఉంది. ఇక అదే దిల్ తో తనను నిర్మాతగా మార్చిన వీ వీ వినాయక్ ను యాక్టర్ మార్చి సీనయ్య సినిమా చేద్దామని ప్లాన్ చేసిన దిల్ రాజు కి ఆ ప్రాజెక్ట్ కూడా సెట్ పైకి వెళ్ళకముందే క్యాన్సిల్ అయింది.

ఇలా తన మొదటి సినిమా హీరోకి , అలాగే మొదటి దర్శకుడికి ఇరవై ఏళ్ల నుండి బాకీ పడిపోయారు దిల్ రాజు. త్వరలోనే నితిన్ తో ఓ సినిమా నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. ఆ సినిమాతో నిర్మాతగా నితిన్ బాకీ తీర్చేస్తారేమో చూడాలి. ఇక వీవీ వినాయక్ బాకీ కూడా తొందర్లోనే తీరే అవకాశం కనిపిస్తుంది. కథ సెట్ అయితే మళ్ళీ ఈ కాంబోలో సినిమా రావొచ్చు. కానీ వీవీ వినాయక్ దర్శకుడిగా కాకుండా యాక్టర్ గా కనిపిస్తారు.

This post was last modified on April 5, 2023 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

25 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

1 hour ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

1 hour ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago