హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ స్టైలిష్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వా లైనప్ పెద్దగానే ఉంది. అందులో ముఖ్యంగా గుహన్ పేరు ఎక్కువగా వినబడుతుంది. సినిమాటోగ్రాఫర్ గుహన్ కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాను తక్కువ బడ్జెట్ తో థ్రిల్లర్ గా రూపొందించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. శివానీ రాజశేఖర్ తో WWW అనే ఓటీటీ సినిమా చేశాడు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండతో గుహన్ ‘హై వే’ అనే సినిమా చేశాడు అది కూడా ఓటీటీలో రిలీజైంది.
ఇక 118 తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథ రాసుకున్న గుహన్ ఆ కథను ఇప్పుడు శర్వాకి చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. ఎప్పటి నుండో గుహన్ దిల్ రాజు బేనర్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. బహుశా అన్నీ కుదిరితే శర్వా , గుహన్ సినిమా దిల్ రాజు బేనర్ లోనే ఉంటుంది.
శర్వా హీరోగా డిఫరెంట్ మూవీస్ చేయాలని భావిస్తున్నాడు. ఒకే ఒక జీవితం తర్వాత కొత్త కథలు , చేయని జానర్స్ టచ్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే గుహన్ తో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు కావచ్చు. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి కళ్యాణ్ రామ్ కి థ్రిల్లర్ జోనర్ లో హిట్ ఇచ్చిన ఈ సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ ఇప్పుడు శర్వానంద్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో ?
This post was last modified on April 5, 2023 6:30 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…