హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ స్టైలిష్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వా లైనప్ పెద్దగానే ఉంది. అందులో ముఖ్యంగా గుహన్ పేరు ఎక్కువగా వినబడుతుంది. సినిమాటోగ్రాఫర్ గుహన్ కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాను తక్కువ బడ్జెట్ తో థ్రిల్లర్ గా రూపొందించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. శివానీ రాజశేఖర్ తో WWW అనే ఓటీటీ సినిమా చేశాడు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండతో గుహన్ ‘హై వే’ అనే సినిమా చేశాడు అది కూడా ఓటీటీలో రిలీజైంది.
ఇక 118 తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథ రాసుకున్న గుహన్ ఆ కథను ఇప్పుడు శర్వాకి చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. ఎప్పటి నుండో గుహన్ దిల్ రాజు బేనర్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. బహుశా అన్నీ కుదిరితే శర్వా , గుహన్ సినిమా దిల్ రాజు బేనర్ లోనే ఉంటుంది.
శర్వా హీరోగా డిఫరెంట్ మూవీస్ చేయాలని భావిస్తున్నాడు. ఒకే ఒక జీవితం తర్వాత కొత్త కథలు , చేయని జానర్స్ టచ్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే గుహన్ తో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు కావచ్చు. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి కళ్యాణ్ రామ్ కి థ్రిల్లర్ జోనర్ లో హిట్ ఇచ్చిన ఈ సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ ఇప్పుడు శర్వానంద్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో ?
This post was last modified on April 5, 2023 6:30 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…