హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ స్టైలిష్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వా లైనప్ పెద్దగానే ఉంది. అందులో ముఖ్యంగా గుహన్ పేరు ఎక్కువగా వినబడుతుంది. సినిమాటోగ్రాఫర్ గుహన్ కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాను తక్కువ బడ్జెట్ తో థ్రిల్లర్ గా రూపొందించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. శివానీ రాజశేఖర్ తో WWW అనే ఓటీటీ సినిమా చేశాడు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండతో గుహన్ ‘హై వే’ అనే సినిమా చేశాడు అది కూడా ఓటీటీలో రిలీజైంది.
ఇక 118 తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథ రాసుకున్న గుహన్ ఆ కథను ఇప్పుడు శర్వాకి చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. ఎప్పటి నుండో గుహన్ దిల్ రాజు బేనర్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. బహుశా అన్నీ కుదిరితే శర్వా , గుహన్ సినిమా దిల్ రాజు బేనర్ లోనే ఉంటుంది.
శర్వా హీరోగా డిఫరెంట్ మూవీస్ చేయాలని భావిస్తున్నాడు. ఒకే ఒక జీవితం తర్వాత కొత్త కథలు , చేయని జానర్స్ టచ్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే గుహన్ తో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు కావచ్చు. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి కళ్యాణ్ రామ్ కి థ్రిల్లర్ జోనర్ లో హిట్ ఇచ్చిన ఈ సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ ఇప్పుడు శర్వానంద్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో ?
This post was last modified on April 5, 2023 6:30 am
ఉత్తరాది హారర్ కామెడీ అనే జానర్ కు కమర్షియల్ రేంజ్ తీసుకొచ్చిన ఘనత లారెన్స్ రాఘవేంద్రకే దక్కుతుంది. ముని సినిమా…
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు…
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…