దిల్ రాజు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత. చిన్న సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి.. తనకంటూ.. ప్రత్యేకతను చాటుకున్నా రు. ప్రస్తుతం ఏపీ నిర్మాతల మండలి పొజిషన్లో ఉన్నారు. ఇటీవలే కమెడియన్ వేణుతో తీసిన ‘బలగం’ మూవీ కూడా అంచ నాలు దాటి సూపర్ హిట్ అయ్యింది. ఇక, ఏపీ ప్రభుత్వంతోనూ.. దిల్ రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ కూడా ఉంది. ఏపీలో ఏడాదిన్నర కిందట సినిమా టికెట్లు విషయం వివాదానికి దారితీసినప్పుడు.. తొలిసారు.. ఆయన రాజు కాదు.. రెడ్డి అని తెలిసింది.
ఇక, ఏపీ ప్రభుత్వంతో చర్చలకు కూడా చొరవ చూపించి.. సినిమా టికెట్ల వివాదాన్ని తనదైన శైలిలో పరిష్కరించేందుకు ప్రయ త్నించారు. అదేవిధంగా తెలుగు సినిమాల్లో నావెల్టీని పెంచుతున్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజా విషయాని కి వస్తే.. అటు తెలంగాణలోను, ఇటుఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అయింది. ఈ ఏడాది చివరిలో తెలంగాణలోను, వచ్చే ఏడాది ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినీ రంగంలో ఉన్నవారికి.. రాజకీయాల్లోకి రావాలంటూ.. పిలుపులు అందుతున్నాయి.
ఇప్పటికే చాలా మంది కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా.. రాజకీయాల్లోకి వచ్చారు. ఇలానే దిల్ రాజుకుకూడా. ఆఫర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని వైసీపీ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందుతోందని..కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. అదేసమయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన వైపు ఆయనే చూస్తున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగం ప్రవేశంపై వస్తున్న వార్తల విషయంలో దిల్ రాజు తాజాగా స్పందించారు.
“రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవమే… కానీ, నేను ఇక్కడ(టాలీవుడ్) వేసే రాళ్లే తట్టుకోలేకపోతున్నా… అక్కడ(రాజకీయం) రాళ్ళు అసలు తట్టుకోలేను అనే అనుకుంటున్నా” అని దిల్ రాజు ముక్తాయించారు. కేవలం ఒకే ఒక్క కామెంట్తో తన రాజకీయాలపై వస్తున్నరూమర్లకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు.
This post was last modified on April 4, 2023 8:39 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…