విడుదలైన నెల రోజుల తర్వాత కూడా చర్చల్లో ఉండటం పెద్ద సినిమాల వల్లే కావడం లేదు. అలాంటిది ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని బలగం మూవీ కొత్త కొత్త టాపిక్స్ లో నానుతూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పల్లెటూళ్ళలోని బహిరంగ ప్రదేశాల్లో బలగంని ఉచితంగా ప్రదర్శించడం పెద్ద ట్రెండ్ గా మారిపోయింది. జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు, ఆట పూర్తయ్యాక విడిపోయిన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మరీ కలుసుకుంటున్న ఉదంతాలు సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ ఏకంగా వీటి మీద స్పెషల్ స్టోరీలు ఇస్తున్నాయి.
మొన్న ఈ ఉదంతం మీద నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ ఎస్పికి ఫిర్యాదు చేయడంతో ఆయన పట్ల ఓ వర్గంలో నెగటివిటీ వచ్చేసింది. అత్యాశకు పోతున్నారని ఇలా షోలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సరికాదని విమర్శలు చేశారు. వీటికి స్వయంగా దిల్ రాజుగారే వివరణ ఇచ్చారు. బలగం ఎవరు ఎప్పుడు ఎక్కడైనా చూడొచ్చని, ఎవరూ ఆపలేరని, ఇల్లీగల్ గా కొందరు షోలు వేయడం వల్ల అమెజాన్ నుంచి ఒత్తిడి రావడం వల్లే కంప్లయింట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఎవరైనా గ్రామాల్లో చూడాలనుకుంటే మేమే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇప్పుడు చూస్తూ ఉండిపోతే భవిష్యత్తులో కొత్త సినిమాలు ఇలా ఓపెన్ ప్లేస్ లో ఫ్రీగా వేయడం వల్ల థియేటర్ల మనుగడకు ఇబ్బందిగా మారుతుందని అందుకే చర్యకు ఉపక్రమించామే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. సో బలగంకి ఇంకాస్త బలం వచ్చినట్టే. నేరుగా ఎస్విసి సంస్థను కలుసుకుంటే షోలకు కావాల్సిన తతంగం వాళ్లే చూసుకుంటారు. ఎలాగూ స్క్రీన్లు స్పీకర్లు సర్పంచులు పెడుతున్నారు కాబట్టి అనుమతులు లైసెన్సులు ప్రింట్లు దిల్ రాజు బృందం ఇచ్చేస్తుంది. తనకు పేరు వస్తే చాలు బ్యాడ్ చేయడానికి ఒక బ్యాచ్ రెడీగా ఉంటుందని రాజుగారు చెప్పడం కొసమెరుపు.
This post was last modified on April 4, 2023 2:57 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…