బాక్సాఫీస్ మీద ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల దెబ్బ గట్టిగానే పడుతోంది. మార్చి 31న ప్రారంభమైన ఈ మెగా స్పోర్ట్స్ మేళాను అభిమానులు ఎగబడి చూస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభావం నేరుగా థియేటర్ల మీద చూపిస్తోంది. మొదటి నాలుగు రోజు ధూమ్ ధామ్ దోస్తాన్ అంటూ వసూళ్లతో చెడుగుడు ఆడిన దసరా హఠాత్తుగా సోమవారం నుంచి సాధారణంగా ఉండాల్సిన డ్రాప్ కంటే ఎక్కువ చూపించడం దీని వల్లేనని ట్రేడ్ విశ్లేషణ. ఐపిఎల్ ని జియో సినిమా యాప్ ఉచితంగా ఫోర్ కె రిజొల్యూషన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. పైసా కట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు.
దీంతో రోజువారీ ఆటలను చూసే సంఖ్య విపరీతంగా ఉంటోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి జట్లు ఆడుతున్నప్పుడు సగటు కనీసం కోటికి పైగా ఆన్ లైన్ వ్యూస్ ఉంటున్నాయి. అక్కడే కాదు గ్రౌండ్లు సైతం జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వారం ముందే టికెట్లు సోల్డ్ అవుట్ కావడం కంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ఒకవేళ ఇది లేకపోతే దసరా ఈపాటికే వంద కోట్ల గ్రాస్ ని సులభంగా దాటేసేది. ప్రస్తుతం 92 దగ్గర ఉంది. ఈ వీకెండ్ అవ్వగానే క్రాస్ చేయడం లాంఛనమే. దసరా కాకుండా మిగిలినవన్నీ డెఫిషిట్ లోనే నడుస్తున్నాయి.
ఇంకో ఇరవై రోజులకు పైగా ఐపిఎల్ కొనసాగనుంది. ఒకవేళ పైన చెప్పిన మూడు నాలుగు జట్లు కనక మంచి పెరఫార్మాన్స్ చూపించి సెమి ఫైనల్స్ దాకా వెళ్లగలిగితే అప్పుడు కలెక్షన్లకు ఇంకొంత గడ్డుకాలం తప్పదు. అసలే బయట విపరీతమైన ఎండలు. దీనికి తోడు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. దాంతో సహజంగానే సినిమాల పట్ల ఆసక్తి తక్కువగానే కనిపిస్తోంది. రవితేజ లాంటి స్టార్ హీరో నటించిన రావణాసుర బుకింగ్స్ సైతం చాలా నెమ్మదిగా ఉన్నాయి. దీన్ని బట్టే పరిస్థితుల ప్రభావం టికెట్ కౌంటర్ల మీద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 4, 2023 2:40 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…