Movie News

ఐపీఎల్ దెబ్బ గట్టిగా తగులుతోంది

బాక్సాఫీస్ మీద ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల దెబ్బ గట్టిగానే పడుతోంది. మార్చి 31న ప్రారంభమైన ఈ మెగా స్పోర్ట్స్ మేళాను అభిమానులు ఎగబడి చూస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభావం నేరుగా థియేటర్ల మీద చూపిస్తోంది. మొదటి నాలుగు రోజు ధూమ్ ధామ్ దోస్తాన్ అంటూ వసూళ్లతో చెడుగుడు ఆడిన దసరా హఠాత్తుగా సోమవారం నుంచి సాధారణంగా ఉండాల్సిన డ్రాప్ కంటే ఎక్కువ చూపించడం దీని వల్లేనని ట్రేడ్ విశ్లేషణ. ఐపిఎల్ ని జియో సినిమా యాప్ ఉచితంగా ఫోర్ కె రిజొల్యూషన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. పైసా కట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు.

దీంతో రోజువారీ ఆటలను చూసే సంఖ్య విపరీతంగా ఉంటోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి జట్లు ఆడుతున్నప్పుడు సగటు కనీసం కోటికి పైగా ఆన్ లైన్ వ్యూస్ ఉంటున్నాయి. అక్కడే కాదు గ్రౌండ్లు సైతం జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వారం ముందే టికెట్లు సోల్డ్ అవుట్ కావడం కంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ఒకవేళ ఇది లేకపోతే దసరా ఈపాటికే వంద కోట్ల గ్రాస్ ని సులభంగా దాటేసేది. ప్రస్తుతం 92 దగ్గర ఉంది. ఈ వీకెండ్ అవ్వగానే క్రాస్ చేయడం లాంఛనమే. దసరా కాకుండా మిగిలినవన్నీ డెఫిషిట్ లోనే నడుస్తున్నాయి.

ఇంకో ఇరవై రోజులకు పైగా ఐపిఎల్ కొనసాగనుంది. ఒకవేళ పైన చెప్పిన మూడు నాలుగు జట్లు కనక మంచి పెరఫార్మాన్స్ చూపించి సెమి ఫైనల్స్ దాకా వెళ్లగలిగితే అప్పుడు కలెక్షన్లకు ఇంకొంత గడ్డుకాలం తప్పదు. అసలే బయట విపరీతమైన ఎండలు. దీనికి తోడు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. దాంతో సహజంగానే సినిమాల పట్ల ఆసక్తి తక్కువగానే కనిపిస్తోంది. రవితేజ లాంటి స్టార్ హీరో నటించిన రావణాసుర బుకింగ్స్ సైతం చాలా నెమ్మదిగా ఉన్నాయి. దీన్ని బట్టే పరిస్థితుల ప్రభావం టికెట్ కౌంటర్ల మీద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on April 4, 2023 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago