Movie News

ప‌దేళ్ల‌కు పిల్ల‌లు.. చ‌ర‌ణ్‌, ఉపాస‌న ముందే ఫిక్స్

ప‌దేళ్ల కింద‌ట పెళ్లి చేసుకున్న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట.. ఎంత‌కీ త‌ల్లిదండ్రులు కాక‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. దీని మీద ట్విట్ట‌ర్లో స్పేస్‌లు పెట్టి మ‌రీ చ‌ర్చించుకున్నారు జ‌నాలు. ఈ విష‌యం మీద చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌ను దారుణంగా ట్రోల్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఏదో స‌మ‌స్య ఉండ‌టం వ‌ల్ల ఈ జంట‌కు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌ని తేల్చేసిన వాళ్లూ లేక‌పోలేదు.

ఐతే ఈ ఊహాగానాల‌న్నింటికీ తెర‌దించుతూ గ‌త ఏడాది చ‌ర‌ణ్‌, ఉపాస‌న త‌ల్లిదండ్రులు కాబోతున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. దీంతో అంద‌రి నోళ్ల‌కు తాళాలు ప‌డ్డాయి. ఐతే ఇంత ఆల‌స్యంగా బిడ్డ‌ను క‌నాల‌న్న నిర్ణ‌యం పెళ్లి స‌మ‌యంలోనే తీసుకున్నారట చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌. బ‌య‌టి వ్య‌క్తుల‌తో పాటు కుటుంబ స‌భ్యుల ఒత్తిడిని కూడా త‌ట్ట‌కుని తాము ప‌దేళ్ల పాటు పిల్ల‌ల్ని క‌న‌కుండా ఉన్న‌ట్లు ఉపాస‌న వెల్ల‌డించ‌డం విశేషం.

“స‌మాజం కోరుకున్న‌పుడు కాకుండా నేను త‌ల్లిని కావాల‌నుకున్న‌పుడు గ‌ర్భం దాల్చ‌డం ప‌ట్ల‌ నాకెంతో ఉత్సాహంగా, గ‌ర్వంగా ఉంది. పెళ్ల‌యిన ప‌దేళ్ల త‌ర్వాత మేం బిడ్డ‌ల‌ను కనాల‌ని అనుకున్నాం. ఎందుకంటే ఇదే సరైన స‌మ‌యం. మేమిద్ద‌రం మా రంగాల్లో ఎదిగాం. మాకు మేముగా ఆర్థికంగా బ‌లోపేతం అయ్యాం. మా పిల్ల‌ల‌కు కావాల్సిన‌వ‌న్నీ ఇచ్చే స్థాయికి చేరాం. ఆల‌స్యంగా పిల్ల‌ల్ని క‌న‌డం అన్న‌ది మా ఇద్ద‌రి నిర్ణ‌యం. ఈ విష‌యంలో అటు స‌మాజంతో పాటు ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి కూడా మేం త‌లొగ్గ‌లేదు. ఇది మా మధ్య బ‌ల‌మైన బంధంతో పాటు పిల్ల‌ల విష‌యంలో మాకున్న స్ప‌ష్ట‌త‌కు నిద‌ర్శ‌నం” అని ఉపాస‌న తెలిపింది. తాను పెళ్ల‌యిన కొత్త‌లో సోష‌ల్ మీడియా నుంచి ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి కూడా ఉపాస‌న ఇప్ప‌టికే ఓపెన్ అయిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on April 4, 2023 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago