ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ కథలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అనుష్క ఇప్పటికే ఈ తరహా కథలతో స్టార్ హీరోయిన్స్ కి ఓ బరోసా ఇచ్చేసింది. నయనతార , కీర్తి సురేష్ లు కూడా ఇలాంటి కథలతో కొన్ని ఎక్స్ పెరిమెంట్స్ చేసేశారు. తాజాగా సమంత కూడా లేడీ ఓరియంటెడ్ కథలకే ఓటేస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఓ బేబీ , యశోదా , శాకుంతలం అనే సినిమాలు చేసేసి సొంత మార్కెట్ తెచ్చుకుంది సామ్. ఇప్పుడు రష్మిక కూడా వీరి దారిలోనే ప్రయాణించబోతుంది.
రష్మిక ప్రదాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా రాబోతుంది. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. రెయిన్ బో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది ఈ సినిమా. అయితే ఇందులో సపోర్టింగ్ పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రను తెలుగులో ఏ హీరో చేయరు కాబోలు. అందుకే మలయాళంలో హీరోగా చేసిన దేవ్ మోహన్ ను ఆ కేరెక్టర్ కి తీసుకున్నారు.
దేవ్ మోహన్ తాజాగా ‘శాకుంతలం’ లో దృశ్యంత్ మహారాజాగా నటించాడు. ఈ పాత్రను తెలుగులో ఏ హీరో చేయరని అందుకే తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని దేవ్ మోహన్ ను ఎంచుకున్నానని గుణ శేఖర్ పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు రష్మిక సినిమాకి కూడా అదే ఇబ్బంది. తెలుగులో మరో హీరో ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు ముందుకు రారనే ఉద్దేశ్యంతో దేవ్ మోహన్ కే ఓటేశారు. ఇలా వరుస ఆఫర్లతో దేవ్ మోహన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అనిపించుకుంటున్నాడు. ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలకి దేవ్ మోహనే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తాడేమో.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…