రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 21న విడుదల కాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మీద సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ పఠాన్ తో వెయ్యి కోట్ల రికార్డును బద్దలు కొట్టడంతో అందులో కనీసం ముప్పాతిక అందుకోవాలని ఎదురు చూస్తున్నారు. అయితే విచిత్రంగా మూవీ మీద ఆశించిన స్థాయిలో హైప్ లేదు. ట్రేడ్ సైతం ఈ పరిణామం పట్ల ఆశ్చర్యపోతోంది. వెంకటేష్ – పూజా హెగ్డే – రోహిణి హట్టంగడి – భూమిక ఇలా తెలుగు ఫ్లేవర్ ఎక్కువ కావడం వల్లే నార్త్ ఆడియన్స్ కు ఇంకా కనెక్ట్ కాలేదని విశ్లేషణ చేస్తోంది.
అందుకే యూనిట్ ఇప్పుడు గేమ్ మార్చి కిసీకా భాయ్ కిసీకా జాన్ లో కీలకమైన మల్టీస్టారర్ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే సల్మాన్ వెంకీలతో పాటు రామ్ చరణ్ కూడా డాన్సు కోసం కాలు కదపడం. దానికి సంబంధించిన ప్రీ విజువల్ ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటుకి ఆస్కార్ వచ్చాక రాజమౌళి తారక్ చరణ్ లకు వరల్డ్ వైడ్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. దీన్నే కండల వీరుడి నిర్మాతలు తమకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. మెగాపవర్ స్టార్ క్యామియోని హైలైట్ చేయబోతున్నారు.
ఇలా చేయడం వెనుక కథ ఉంది. గాడ్ ఫాదర్ లో పావు గంట పాత్రకు కేవలం చిరంజీవి కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా సల్మాన్ పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశారు. ఫలితం గొప్పగా రాకపోయినా ఫ్యాన్స్ అరుదైన కాంబోని తెరమీద చూసుకున్నారు. దానికి బదులుగా చరణ్ ఏరికోరి మరీ కిసీకా భాయ్ కిసీకా జాన్ సెట్స్ కు వెళ్లి మరీ ఆ సినిమాలో భాగమయ్యాడు. ఇప్పుడదే ప్లస్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రీమేక్ గా దీని మీద ప్రచారం ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం ఇంకో ఇరవై రోజులు ఆగాల్సిందే.
This post was last modified on April 3, 2023 5:56 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…