రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 21న విడుదల కాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మీద సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ పఠాన్ తో వెయ్యి కోట్ల రికార్డును బద్దలు కొట్టడంతో అందులో కనీసం ముప్పాతిక అందుకోవాలని ఎదురు చూస్తున్నారు. అయితే విచిత్రంగా మూవీ మీద ఆశించిన స్థాయిలో హైప్ లేదు. ట్రేడ్ సైతం ఈ పరిణామం పట్ల ఆశ్చర్యపోతోంది. వెంకటేష్ – పూజా హెగ్డే – రోహిణి హట్టంగడి – భూమిక ఇలా తెలుగు ఫ్లేవర్ ఎక్కువ కావడం వల్లే నార్త్ ఆడియన్స్ కు ఇంకా కనెక్ట్ కాలేదని విశ్లేషణ చేస్తోంది.
అందుకే యూనిట్ ఇప్పుడు గేమ్ మార్చి కిసీకా భాయ్ కిసీకా జాన్ లో కీలకమైన మల్టీస్టారర్ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే సల్మాన్ వెంకీలతో పాటు రామ్ చరణ్ కూడా డాన్సు కోసం కాలు కదపడం. దానికి సంబంధించిన ప్రీ విజువల్ ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటుకి ఆస్కార్ వచ్చాక రాజమౌళి తారక్ చరణ్ లకు వరల్డ్ వైడ్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. దీన్నే కండల వీరుడి నిర్మాతలు తమకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. మెగాపవర్ స్టార్ క్యామియోని హైలైట్ చేయబోతున్నారు.
ఇలా చేయడం వెనుక కథ ఉంది. గాడ్ ఫాదర్ లో పావు గంట పాత్రకు కేవలం చిరంజీవి కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా సల్మాన్ పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశారు. ఫలితం గొప్పగా రాకపోయినా ఫ్యాన్స్ అరుదైన కాంబోని తెరమీద చూసుకున్నారు. దానికి బదులుగా చరణ్ ఏరికోరి మరీ కిసీకా భాయ్ కిసీకా జాన్ సెట్స్ కు వెళ్లి మరీ ఆ సినిమాలో భాగమయ్యాడు. ఇప్పుడదే ప్లస్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రీమేక్ గా దీని మీద ప్రచారం ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం ఇంకో ఇరవై రోజులు ఆగాల్సిందే.
This post was last modified on April 3, 2023 5:56 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…