అనూహ్య రీతిలో సంచలన విజయం సాధించిన దసరా మొదటి వీకెండ్ ని అద్భుతంగా ముగించింది. కేవలం నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వెళ్ళిపోయి ఔరా అనిపించింది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల షేర్ సాధించిన న్యాచురల్ స్టార్ సినిమా గ్రాస్ రూపంలో 84 కోట్ల దాకా రాబట్టింది. ఇవాళ సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలుకానుంది. మాములుగా బ్లాక్ బస్టర్స్ కి మండేనాడు మరీ తీవ్రమైన డ్రాప్ ఉండదు. కానీ దసరా అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదించిన ట్రెండ్ ని సూచిస్తున్నాయి.
ఇప్పటికే లక్ష్యానికి దగ్గరగా వెళ్లిపోయింది కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ ఇంకో రెండు వారాల రన్ సులభంగా దక్కాల్సిన టైంలో ఇప్పుడు జరిగే ఏ పరిణామమైనా విశ్లేషించుకోవాల్సిందే. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ టికెట్ రేట్ల పెంపు వసూళ్లలో కీలక భాగం పోషించింది. మల్టీప్లెక్సుల్లో 295 రూపాయలు గరిష్ట ధర పెట్టేయడంతో భారీ ఫిగర్లు నమోదయ్యాయి. అయితే వెంటనే తగ్గించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సుముఖంగా లేకపోవడంతో దాని ప్రభావం వీక్ డేస్ లో పడుతుంది. దాని వల్లే అడ్వాన్స్ కన్నా ఎక్కువ కరెంట్ బుకింగ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఇవాళ్టి నుంచి పదో తరగతి చివరి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఆ పిల్లలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం థియేటర్లకు దూరంగా ఉంటారు. దీని ఎఫెక్ట్ కలెక్షన్ల మీద ఉంటుంది. తర్వాత శుక్రవారం ఒకే రోజు కిరణ్ అబ్బవరం మీటర్, రవితేజ రావణాసుర ఒకేసారి రిలీజ్ కానున్నాయి. వాటి టాక్ దసరాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏప్రిల్ 7 తేలుతుంది. నాని అభిమానుల చూపు వంద కోట్ల గ్రాస్ మీద ఉంది. ఇంకో పదహారు కోట్లే దూరం కాబట్టి చేరుకోవడం గ్యారెంటీనే. న్యాచురల్ స్టార్ కెరీర్ లో అతి పెద్ద మైలురాయికి రంగం సిద్ధమవుతోంది.
This post was last modified on April 3, 2023 11:26 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…