తెలంగాణ వ్యాప్తంగా ఏదో సంబరంలా జరుగుతున్న బలగం ఓపెన్ ఫ్రీ షోలు పెద్ద రాద్ధాంతానికే దారి తీసేలా ఉన్నాయి. ముందు ఒకటి రెండు గ్రామాల్లో మొదలైన ఈ ట్రెండ్ మెల్లగా వందల సంఖ్యలో పల్లెటూళ్ళకు పాకిపోవడంతో ఉచితంగా చూసిన వాళ్ళ సంఖ్య లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదనేలా ఉంది. సోషల్ మీడియాలో ఈ స్క్రీనింగ్స్ తాలూకు ఫోటోలు వీడియోలు వైరలవుతున్నాయి. దీంతో థియేటర్ రెవిన్యూకు గండి పడుతోందని గుర్తించిన నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థ తరఫున నిజామాబాద్ ఎస్పికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ లేఖలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు అమెజాన్ ప్రైమ్ నుంచి చట్టవ్యతిరేకంగా సినిమాను డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా పబ్లిక్ కి పంచి పెడుతున్నాయని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. నిజానికి ఎగ్జిబిషన్ యాక్ట్ ప్రకారం నిర్మాత అనుమతి లేకుండా వందల జనాన్ని పోగేసి అలా ఆరుబయట సినిమా వేయడం ఇల్లీగలే. అయితే జనంలో బలగం పట్ల విపరీతమైన ఆసక్తిని గమనించిన సర్పంచులు రాజకీయ నాయకులు వాళ్ళను సంతోష పెట్టడం కోసం షోలు వేయడం ఇంత రభసకు కారణమయ్యింది. ప్రైమ్ కు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది.
అసలు రిలీజై విజయవంతంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాను కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటికి ఇచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. అదే ఏ నెలన్నరో రెండు నెలలో అయ్యుంటే ఈ స్థాయిలో ఫ్రీ షోలు పడేవి కాదన్నది వాస్తవం. ఒకరకంగా ఇక్కడ ప్రొడ్యూసర్ వల్లే ఈ పరిణామం తలెత్తింది. అలా అని వేసినవాళ్లది ఏ తప్పూ లేదని కాదు. అత్యుత్సాహంలో ఇలా చేయడం కరెక్టా కాదానేది ఎవరిని అడగకుండా పని కానిచ్చేశారు. తీరా చూస్తే వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. ఇదంతా ఎలా ఉన్నా బలగం చూశాక తెలంగాణలో కొన్ని విడిపోయిన కుటుంబాలు కలవడం కొసమెరుపు.
This post was last modified on April 3, 2023 11:20 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…