సెలబ్రెటీలైనా.. సెలబ్రెటీలను పెళ్లి చేసుకున్న వాళ్లయినా.. సోషల్ మీడియాలో ఏదో ఒక దశలో ట్రోలింగ్ ఎదుర్కొనేవారే. రామ్ చరణ్ను పెళ్లాడిన ఉపాసనకు కూడా ఈ బాధలు తప్పలేదు. పెళ్లయిన కొత్తలో ఉపాసన విపరీతంగా బాడీ షేమింగ్ ఎదుర్కొంది. ఆమెను పెళ్లాడిన చరణ్ సైతం ట్రోలింగ్ ఎదుర్కోక తప్పలేదు. చివరికి వీళ్లిద్దరూ చాలా ఏళ్లు పిల్లలను కనకపోవడం మీద కూడా సోషల్ మీడియా జనాలు ఊరుకోలేదు.
దాని మీద కూడా దారుణమైన మాటలు అన్నారు. కాగా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. తన పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. చరణ్ను పెళ్లి చేసుకున్నాక తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్లు.. అలాగే తనను పెళ్లి చేసుకున్న చరణ్ గురించి జనాలు అన్న మాటల గురించి ఆమె మాట్లాడింది.
“చిన్నప్పట్నుంచి నన్ను ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారు. సొసైటీలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు ఉంటాయి. పెళ్లయిన కొత్తలో నేనూ బాడీ షేమింగ్ కామెంట్లు ఎదుర్కొన్నా. నేను అందంగా లేనని, లావుగా ఉన్నానని అన్నారు. చరణ్ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా కామెంట్ చేశారు. ఇలాంటి విమర్శలు చేసిన వాళ్లను నేను ఏమీ అనాలనుకోవట్లేదు.
ఎందుకంటే వాళ్లకు మా గురించి ఏమీ తెలియదు. చరణ్, నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. భిన్న కుటుంబాల నుంచి వచ్చిన మేం ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటూ ఎదిగాం. పెళ్లయిన కొత్తలో నా గురించి ఏదేదో అన్న వాళ్లు ఈ పదేళ్లలో నన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నా మీద వాళ్లందరి అభిప్రాయం మారిపోయింది. ట్రోల్స్ వచ్చాయని నేను కుంగిపోలేదు. వాటిని జయించాను. విమర్శలను నేను ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను ఒక ఛాంపియన్ లాగా ఫీలవుతుంటా” అని ఉపాసన పేర్కొంది.
This post was last modified on April 2, 2023 4:24 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…