కమర్షియల్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం దక్కడం అరుదు. కేవలం ఆడి పాడేందుకు, గ్లామర్ ఒలకబోసేందుకు తప్ప తమలో ఉన్న నటికి ఛాలెంజ్ విసిరే పాత్రలు దొరకడమే అదృష్టం అనుకోవాలి. కానీ కొందరికి మాత్రం టాలెంట్ వల్లో లక్కు వల్లో అప్పుడప్పుడు అలాంటివి వరిస్తాయి. దసరాలో కథ మొత్తం తన చుట్టే తిరిగే వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ మీద ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయో చూస్తున్నాం. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో జీవించిన తీరు, పెళ్లి మండపం బయట సాంప్రదాయ తెలంగాణ బీట్ కి డాన్స్ చేసిన జోరు గొప్పగా పేలాయి.
మహానటి తర్వాత పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కిన పాత్రల్లో ఇప్పుడు దసరాదే రెండో స్థానం. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, పెంగ్విన్ లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ఎన్ని చేసినా కీర్తికి వాటి వల్ల దక్కిన ప్రయోజనం తక్కువే. అందుకే వెన్నెల చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది. ఇక సమంత ఇంతే ప్రాముఖ్యం ఉన్న క్యారెక్టర్ అయిదేళ్ల క్రితం రంగస్థలంలో రామలక్ష్మిగా చేసింది. పొగరు దూకుడు కలగలిసిన పల్లెటూరి అమ్మాయిగా ఆమె తీసుకున్న డబ్బు బాకీనే సుకుమార్ కథలో కీలక మలుపుకు కారణమవుతుంది. రంగమ్మ మంగమ్మ స్టెప్పుల గురించి చెప్పనక్కర్లేదు
పోలికల పరంగా ఎవరు గ్రేట్ అనేది చూసుకుంటే నువ్వా నేనా అనే స్థాయిలో ఇద్దరూ పండించారు కాబట్టి ఈ అంశాన్ని జడ్జ్ చేయడం అంత సులభం కాదు. అయితే కీర్తి సురేష్ క్లిష్టమైన తెలంగాణ యాసని నేర్చుకుని మరీ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఓ మార్కు ఎక్కువే తెచ్చినా సామ్ ని తక్కువ చేసి చూడలేం. ఏది ఏమైనా పోస్టర్ తో మొదలుపెట్టి సినిమా దాకా హీరో డామినేషనే అధికంగా ఉన్న టాలీవుడ్ లో గురు శిష్యులు సుకుమార్ – శ్రీకాంత్ ఓదెలలు ఇలాంటి వెన్నెల రామలక్ష్మిలను సృష్టించి మరికొందరికి స్ఫూర్తినివ్వడమే కాదు కొత్త ట్రెండ్ కి దారి చూపిస్తున్నారు
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…