సినీ పరిశ్రమలో ఫోకస్ అంతా ఎప్పుడూ హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకుల చుట్టూనే తిరుగుతుంటుంది. నటీనటుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి.. టెక్నీషియన్లలో మిగతా వారి గురించి పట్టించుకునేవారు తక్కువ. మీడియాలో కూడా వీరికి పెద్దగా ప్రాధాన్యం దక్కదు. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు కూడా తెలియకుండానే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటాయి. కొద్దిమంది మాత్రమే పాపులర్ అవుతారు.
మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు. తెలుగు విషయానికి వస్తే రావు రమేష్ లాంటి కొద్దిమంది మాత్రమే పాపులర్. ఎంతో ప్రతిభ ఉండి కూడా మరుగున పడిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఈ మధ్య గోపరాజు రమణ అనే ఒక ప్రతిభావంతుడైన క్యారెక్టర్ ఆర్టిస్టు వెలుగులోకి వచ్చాడు. ఆయన చాలా ఏళ్లు సీరియళ్లతో పాటు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో నెట్టుకొచ్చారు. మిడిల్ క్లాస్ మెలోడీస్, అశోక వనంలో అర్జున కళ్యాణం, స్వాతిముత్యం లాంటి సినిమాలు ఆయన పేరు జనాలకు తెలిసేలా చేశాయి.
ఇప్పుడు ఇలాంటి ఇంకో ప్రతిభావంతుడైన క్యారెక్టర్ ఆర్టిస్టు వెలుగులోకి వస్తున్నాడు. ఆయన పేరు.. మురళీధర్ గౌడ్. ఈ పేరు చెబితే ఆ మనిషి ఎవరు అనేది తెలియకపోవచ్చు. కానీ ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ తండ్రిగా నటించిన వ్యక్తి అంటే వెంటనే కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కంటే ముందే చాలా చిత్రాల్లో నటించినా మురళీధర్కు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లులో నేచురల్ పెర్ఫామెన్స్తో మురళీధర్ గౌడ్ బలమైన ముద్రే వేశాడు.
ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. లేటెస్టుగా ‘బలగం’ సినిమయాతో ఆయన పేరు మార్మోగుతోంది. ఇందులో తన భార్య పుట్టింటి వాళ్లు తనను గౌరవించలేదని అలిగి ఏళ్ల పాటు ఆ ఇంటి గడప తొక్కని అల్లుడి పాత్రలో ఆయన అదరగొట్టేశారు. ఈ సినిమాతో మురళీధర్కు మామూలు పేరు రాలేదు. ఆయన పేరు ఇప్పుడు అందరికీ బాగానే తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. మురళీధర్ సినిమాల్లోకి అనుకోకుండా వచ్చారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పని చేస్తూ అప్పుడప్పుడూ నాటకాలు వేసిన ఆయన.. రిటైర్మెంట్ తర్వాత సినిమాల్లోకి వచ్చి పేరు సంపాదించడం విశేషం.
This post was last modified on April 1, 2023 5:15 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…