అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 ది రూల్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం స్క్రిప్ట్ కోసమే ఏడాదికి పైగా ఖర్చు పెట్టిన సుక్కు సార్ నిర్మాణంలోనూ రాజీ పడటం లేదు. అందుకే ఎంత ఆలస్యమవుతున్నా ఒత్తిడికి తలొగ్గకుండా, ఫలానా సీజన్ కే రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
దానికి తగ్గట్టే బన్నీ పూర్తి సహకారం ఇవ్వడంతో సుకుమార్ మీద ఎలాంటి ప్రెజర్ లేదు. ఏప్రిల్ 8న స్పెషల్ టీజర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుష్ప డిజిటల్ హక్కులకు గాను మైత్రి అధినేతలు 200 కోట్లు ఆశిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ చాలా పట్టుదలగా దీన్ని సొంతం చేసుకోవాలని మాట్లాడుతోందని ఇన్ సైడ్ టాక్.
ఒక్క వీరసింహారెడ్డి తప్ప ఇటీవలి ఈ బ్యానర్ సినిమాలన్నీ ఈ ఓటిటికే ఇచ్చారు. వాల్తేరు వీరయ్య, అంటే సుందరానికి, అమిగోస్, హ్యాపీ బర్త్ డే వగైరాలకు భారీ రేట్లిచ్చి కొన్నారు. అయితే పుష్పకు మరీ ఇంత ఫిగర్ అంటే కష్టమని అందుకే ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని వినికిడి. బయటకి కనిపించని మరో వెర్షన్ కూడా ఉంది.
బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ వారం మొత్తం తన గురించి పుష్ప గురించి సోషల్ మీడియాలో హోరెత్తిపోయేలా పిఆర్ టీమ్ ప్రత్యేకంగా ప్లాన్ చేసిందని అందులో భాగంగానే ఈ రెండు వందల కోట్ల టాక్ ని బయటికి వదిలారని అంటున్నారు. ఇందులో నిజమెంతో మైత్రికే ఎరుక. ఎంత క్రేజ్ ఉన్నా ఒక కమర్షియల్ సినిమాకు థియేటర్ రిలీజ్ తర్వాత ఓటిటికి అంత మొత్తం అంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ జరిగితే మటుకు చరిత్రే అవుతుంది. బాహుబలి, కెజిఎఫ్ తర్వాత సీక్వెల్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందనే ధీమా ఫ్యాన్స్ లో బాగా కనిపిస్తోంది.
This post was last modified on April 1, 2023 2:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…