టాలీవుడ్ లెజెండరీ నిర్మాత డా. డి. రామానాయుడు కుటుంబానికి మంచి గౌరవం ఉంది. ఈ కుటుంబం నుండి హీరోలుగా వచ్చిన వెంకటేశ కి అలాగే రానా లకు మంచి రెస్పాన్స్ దక్కింది. వెంకటేష్ తర్వాత రానా దగ్గుబాటి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరోను పరిచయం చేసే కార్యక్రమం జరిగింది.
తేజ డైరెక్షన్ లో దగ్గుబాటి సురేష్ బాబు మరో కొడుకు అభిరామ్ అహింస అనే సినిమా చేశాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా నెలలు గడుస్తుంది. ఏప్రిల్ 7 న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కానీ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అసలు అహింస వస్తుందా లేదా అనేది కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. అయితే దగ్గుబాటి కుటుంబం నుండి ఓ హీరో వస్తున్నాడంటే కొంత సందడి ఉండాలి.
అలాంటి హంగామా ఏమి కనిపించడం లేదు. దీంతో సురేష్ బాబు తన కొడుకు డెబ్యూ సినిమాపై ఆశలు వదిలేసుకున్నట్టేనా ? అనే కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత కాదు కానీ అంతా ఆయనే చూసుకుంటున్నారు. రానా కూడా రిలీజ్ , ప్రమోషన్స్ విషయంలో తన వంతు మాటలు అందిస్తున్నాడు.
అంతా బాగానే ఉంది కానీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి అహింస టీం ఎందుకు సైలెంట్ అయిపోయినట్టు ? ఒక వేళ అదే రోజు రవితేజ ‘రావణాసుర’ , కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఉన్నందున రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారా ? తెలియాల్సి ఉంది. ఏదేమైనా దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమాకి అన్నీ అడ్డంకులే తగులుతున్నాయి. ఈ సినిమాకి మోక్షం ఎప్పుడో ? మరి.
This post was last modified on April 1, 2023 8:28 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…