Movie News

సురేష్ బాబు ఆశలు వదిలేసుకున్నారా ?

టాలీవుడ్ లెజెండరీ నిర్మాత డా. డి. రామానాయుడు కుటుంబానికి మంచి గౌరవం ఉంది. ఈ కుటుంబం నుండి హీరోలుగా వచ్చిన వెంకటేశ కి అలాగే రానా లకు మంచి రెస్పాన్స్ దక్కింది. వెంకటేష్ తర్వాత రానా దగ్గుబాటి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరోను పరిచయం చేసే కార్యక్రమం జరిగింది.

తేజ డైరెక్షన్ లో దగ్గుబాటి సురేష్ బాబు మరో కొడుకు అభిరామ్ అహింస అనే సినిమా చేశాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా నెలలు గడుస్తుంది. ఏప్రిల్ 7 న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కానీ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అసలు అహింస వస్తుందా లేదా అనేది కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. అయితే దగ్గుబాటి కుటుంబం నుండి ఓ హీరో వస్తున్నాడంటే కొంత సందడి ఉండాలి.

అలాంటి హంగామా ఏమి కనిపించడం లేదు. దీంతో సురేష్ బాబు తన కొడుకు డెబ్యూ సినిమాపై ఆశలు వదిలేసుకున్నట్టేనా ? అనే కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత కాదు కానీ అంతా ఆయనే చూసుకుంటున్నారు. రానా కూడా రిలీజ్ , ప్రమోషన్స్ విషయంలో తన వంతు మాటలు అందిస్తున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి అహింస టీం ఎందుకు సైలెంట్ అయిపోయినట్టు ? ఒక వేళ అదే రోజు రవితేజ ‘రావణాసుర’ , కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఉన్నందున రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారా ? తెలియాల్సి ఉంది. ఏదేమైనా దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమాకి అన్నీ అడ్డంకులే తగులుతున్నాయి. ఈ సినిమాకి మోక్షం ఎప్పుడో ? మరి.

This post was last modified on April 1, 2023 8:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ పాత చంద్రబాబు ఎంట్రీ ఇచ్చేసినట్టేనా..?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి…

6 minutes ago

శివాజీ…కొత్త విలన్ దొరికేశాడు

టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…

28 minutes ago

ఈ మాత్రం దానికి డబ్బింగ్ రిలీజ్ దేనికి

మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ 'ఆఫీసర్ ఆన్…

53 minutes ago

వైరల్ హోర్డింగ్.. కాంగ్రెస్ మార్క్ ప్రచారం

సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.…

1 hour ago

కుదిరితే క‌లిసిరా.. లేక‌పోతే బీజేపీ భ‌జ‌న చేసుకో: ప‌వ‌న్‌కు డీఎంకే వార్నింగ్

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మిళ‌నాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వ‌రుస పెట్టి విమ‌ర్శ‌లు…

2 hours ago

కుంభమేళాలో 30 కోట్ల ఆదాయం… ట్విస్ట్ ఇచ్చిన ఐటీ అధికారులు

మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన…

2 hours ago