నాగార్జున చాలా మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎప్పుడూ కొత్త కథలు , కొత్త దర్శకులకే ఇంపార్టెన్స్ ఇచ్చే నాగ్ త్వరలోనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళం రీమేక్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. జనవరిలో ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది, కానీ ఇవ్వలేదు.
ఆ తర్వాత ఈ సినిమాకు రీమేక్స్ రైట్స్ చిక్కు వచ్చి పడింది. ప్రసన్న అభిషేక్ అగర్వాల్ తో మూడేళ్ళ క్రితం మలయాళం పెరింజు మరియమ్ జోస్ అనే రీమేక్ రైట్స్ కొనిపించాడు. ఇప్పుడు ఆ రైట్స్ తీసుకొని ప్రసన్న నాగార్జునతో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఆ రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు.
దీంతో రైట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ అగర్వాల్ సీన్ లోకి ఎంటరై తను ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటన రిలీజ్ చేశారు. దాదాపు ఇరవై రోజులుగా ఈ రైట్స్ తో లోలోపల హాట్ హాట్ డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఇంకా రైట్స్ గొడవ ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. దీంతో ఇండస్ట్రీలో అందరూ నాగ్ కొత్త దర్శకుడితో భలే ఇబ్బందులు పడుతున్నాడే అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.
ప్రసన్న ఈ రీమేక్ ను తన స్టైల్ లో మార్పులతో తెరకెక్కించబోతున్నాడు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో రెక్కీ కూడా చేసుకొని వచ్చాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ లను రెండు పాత్రలకు లాక్ చేసుకున్నాడు. ఏప్రిల్ లేదా మేలో ఘాట్ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సీనియర్ హీరోతో అవుట్ డోర్ ఘాట్ కాబట్టి సమ్మర్ పూర్తయ్యాకే సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారు.
This post was last modified on March 31, 2023 11:20 pm
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…