Movie News

కొత్త దర్శకుడితో నాగ్ పాట్లు

నాగార్జున చాలా మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎప్పుడూ కొత్త కథలు , కొత్త దర్శకులకే ఇంపార్టెన్స్ ఇచ్చే నాగ్ త్వరలోనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళం రీమేక్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. జనవరిలో ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది, కానీ ఇవ్వలేదు.

ఆ తర్వాత ఈ సినిమాకు రీమేక్స్ రైట్స్ చిక్కు వచ్చి పడింది. ప్రసన్న అభిషేక్ అగర్వాల్ తో మూడేళ్ళ క్రితం మలయాళం పెరింజు మరియమ్ జోస్ అనే రీమేక్ రైట్స్ కొనిపించాడు. ఇప్పుడు ఆ రైట్స్ తీసుకొని ప్రసన్న నాగార్జునతో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఆ రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు.

దీంతో రైట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ అగర్వాల్ సీన్ లోకి ఎంటరై తను ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటన రిలీజ్ చేశారు. దాదాపు ఇరవై రోజులుగా ఈ రైట్స్ తో లోలోపల హాట్ హాట్ డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఇంకా రైట్స్ గొడవ ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. దీంతో ఇండస్ట్రీలో అందరూ నాగ్ కొత్త దర్శకుడితో భలే ఇబ్బందులు పడుతున్నాడే అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

ప్రసన్న ఈ రీమేక్ ను తన స్టైల్ లో మార్పులతో తెరకెక్కించబోతున్నాడు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో రెక్కీ కూడా చేసుకొని వచ్చాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ లను రెండు పాత్రలకు లాక్ చేసుకున్నాడు. ఏప్రిల్ లేదా మేలో ఘాట్ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సీనియర్ హీరోతో అవుట్ డోర్ ఘాట్ కాబట్టి సమ్మర్ పూర్తయ్యాకే సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారు.

This post was last modified on March 31, 2023 11:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago