నాగార్జున చాలా మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎప్పుడూ కొత్త కథలు , కొత్త దర్శకులకే ఇంపార్టెన్స్ ఇచ్చే నాగ్ త్వరలోనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళం రీమేక్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. జనవరిలో ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది, కానీ ఇవ్వలేదు.
ఆ తర్వాత ఈ సినిమాకు రీమేక్స్ రైట్స్ చిక్కు వచ్చి పడింది. ప్రసన్న అభిషేక్ అగర్వాల్ తో మూడేళ్ళ క్రితం మలయాళం పెరింజు మరియమ్ జోస్ అనే రీమేక్ రైట్స్ కొనిపించాడు. ఇప్పుడు ఆ రైట్స్ తీసుకొని ప్రసన్న నాగార్జునతో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఆ రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు.
దీంతో రైట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ అగర్వాల్ సీన్ లోకి ఎంటరై తను ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటన రిలీజ్ చేశారు. దాదాపు ఇరవై రోజులుగా ఈ రైట్స్ తో లోలోపల హాట్ హాట్ డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఇంకా రైట్స్ గొడవ ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. దీంతో ఇండస్ట్రీలో అందరూ నాగ్ కొత్త దర్శకుడితో భలే ఇబ్బందులు పడుతున్నాడే అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.
ప్రసన్న ఈ రీమేక్ ను తన స్టైల్ లో మార్పులతో తెరకెక్కించబోతున్నాడు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో రెక్కీ కూడా చేసుకొని వచ్చాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ లను రెండు పాత్రలకు లాక్ చేసుకున్నాడు. ఏప్రిల్ లేదా మేలో ఘాట్ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సీనియర్ హీరోతో అవుట్ డోర్ ఘాట్ కాబట్టి సమ్మర్ పూర్తయ్యాకే సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…