ఒక బ్లాక్ బస్టర్ సినిమా రీ రీలీజ్ అంటే భారీ హంగామా ఉండనే ఉంటుంది. ఈ మధ్య వచ్చిన ‘పోకిరి’, ‘జల్సా’ ,’ఒక్కడు’ ఇలా చాలా సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే రామ్ చరణ్ తన డిజాస్టర్ సినిమా రీ రీలీజ్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో రామ్ చరణ్ చేసిన రెండో సినిమా ఆరేంజ్ అప్పట్లో డిజాస్టర్ అనిపించుకుంది.
నిర్మాతగా నాగబాబుకి కంటికి కునుకు లేకుండా చేసి అప్పుల పాలు చేసింది. అయితే ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ రీ రిలీజ్ చేయాలని భావించి నాగబాబును ముందుకు తీసుకొచ్చారు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ఆరేంజ్ ఎవరూ ఊహించని విధంగా మూడు రోజుల్లో మూడు కోట్లు కొల్లగొట్టి ఓ రేంజ్ అనిపించుకుంది. అయితే అప్పట్లో ఆరేంజ్ డిజాస్టర్ కావొచ్చు. కానీ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఈ సినిమా ఫేవరెట్.
ముఖ్యంగా సాంగ్స్ కోసం ఈ సినిమాను మళ్ళీ చూసే ఆడియన్స్ ఉన్నారు. అదే రీ రిలీజ్ కి బాగా వర్కవుట్ అయ్యింది. RRR లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం , చరణ్ గ్లోబల్ వైజ్ గుర్తింపు తెచ్చుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఆరేంజ్ తో ఆ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆరేంజ్ కేవలం సింగిల్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకు సిటీలో మల్టీప్లెక్స్ లు దొరకలేదు. మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ తో రిలీజ్ చేసిన వారికి డీలింగ్ సెట్ కాకపోవడంతో అక్కడ ఎఫెక్ట్ పడింది. లేదంటే ఇంకా భారీ కలెక్షన్స్ వచ్చేవి.
ఫైనల్ గా మూడు కోట్లతో డిజాస్టర్ సినిమా ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చిన ఎమౌంట్ ను జనసేన పార్టీకి ఫండ్ ఇవ్వనున్నారు. ఏదేమైనా చరణ్ డిజాస్టర్ సినిమాతో ఇన్నేళ్ల తర్వాత తన సత్తా చాటి మెగా పవర్ స్టార్ నిపించుకున్నాడు.
This post was last modified on March 31, 2023 8:17 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…