ఒక బ్లాక్ బస్టర్ సినిమా రీ రీలీజ్ అంటే భారీ హంగామా ఉండనే ఉంటుంది. ఈ మధ్య వచ్చిన ‘పోకిరి’, ‘జల్సా’ ,’ఒక్కడు’ ఇలా చాలా సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే రామ్ చరణ్ తన డిజాస్టర్ సినిమా రీ రీలీజ్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో రామ్ చరణ్ చేసిన రెండో సినిమా ఆరేంజ్ అప్పట్లో డిజాస్టర్ అనిపించుకుంది.
నిర్మాతగా నాగబాబుకి కంటికి కునుకు లేకుండా చేసి అప్పుల పాలు చేసింది. అయితే ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ రీ రిలీజ్ చేయాలని భావించి నాగబాబును ముందుకు తీసుకొచ్చారు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ఆరేంజ్ ఎవరూ ఊహించని విధంగా మూడు రోజుల్లో మూడు కోట్లు కొల్లగొట్టి ఓ రేంజ్ అనిపించుకుంది. అయితే అప్పట్లో ఆరేంజ్ డిజాస్టర్ కావొచ్చు. కానీ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఈ సినిమా ఫేవరెట్.
ముఖ్యంగా సాంగ్స్ కోసం ఈ సినిమాను మళ్ళీ చూసే ఆడియన్స్ ఉన్నారు. అదే రీ రిలీజ్ కి బాగా వర్కవుట్ అయ్యింది. RRR లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం , చరణ్ గ్లోబల్ వైజ్ గుర్తింపు తెచ్చుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఆరేంజ్ తో ఆ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆరేంజ్ కేవలం సింగిల్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకు సిటీలో మల్టీప్లెక్స్ లు దొరకలేదు. మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ తో రిలీజ్ చేసిన వారికి డీలింగ్ సెట్ కాకపోవడంతో అక్కడ ఎఫెక్ట్ పడింది. లేదంటే ఇంకా భారీ కలెక్షన్స్ వచ్చేవి.
ఫైనల్ గా మూడు కోట్లతో డిజాస్టర్ సినిమా ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చిన ఎమౌంట్ ను జనసేన పార్టీకి ఫండ్ ఇవ్వనున్నారు. ఏదేమైనా చరణ్ డిజాస్టర్ సినిమాతో ఇన్నేళ్ల తర్వాత తన సత్తా చాటి మెగా పవర్ స్టార్ నిపించుకున్నాడు.
This post was last modified on March 31, 2023 8:17 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…