Movie News

రవితేజ సినిమాకు A సర్టిఫికెటా..

మాములుగా స్టార్ హీరోల సినిమాలకు అన్ని వర్గాలు చూసే విధంగా సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారు. ఒకవేళ అధికారులు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే దానికి తగ్గట్టు మ్యూట్లు కట్లు చేసుకుని కనీసం యు/ఏ తో సర్దుకుంటారు. కేవలం A అంటే అడల్ట్స్ ఓన్లీ (పెద్దలకు మాత్రమే) ఇస్తే మాత్రం ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులుంటాయి. 18 ఏళ్ళ వయసు లోపలి వాళ్ళను థియేటర్లో అనుమతించడానికి అవకాశం ఉండదు.

చాలా మటుకు సింగల్ స్క్రీన్లు దీన్ని పట్టించుకోకుండా టికెట్ ఉంటే చాలు పంపిస్తాయి. కానీ అధిక శాతం మల్టీప్లెక్సులు కఠినంగా అమలు చేస్తాయి. తాజాగా రవితేజ రావణాసురకు A వచ్చింది. అంటే వయొలెన్స్ ఏదో గట్టిగానే దట్టించారన్న మాట. క్రైమ్ థ్రిల్లర్ అనే హింట్ ఆల్రెడీ ట్రైలర్ లో ఇచ్చారు కానీ కామెడీ పాటలు తదితర అంశాలు ఉన్నట్టు చూపించారు కాబట్టి ఫ్యామిలీస్ ఛాయస్ గా పెట్టుకోవచ్చనే అందరూ అనుకున్నారు.

తీరా చూస్తే ఇప్పుడీ ట్విస్టు. దర్శక నిర్మాతలు ఒరిజినాలిటీ పోకూడదని ఇలా రా వెర్షన్ ని ఇవ్వాలనుకున్నారో ఏమో తెలియదు. ముప్పై ఆరు కట్లు ఇచ్చిన దసరానే యు/ఏతో బయట పడింది. అందులోనూ హింస ఓ రేంజ్ లో ఉంది. జనం దాన్నేమీ పట్టించుకోకుండా హిట్ చేశారు. మరి రావణాసురలో అంత వయొలెంట్ కంటెంట్ ఏముందో చూడాలి.

సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. సుశాంత్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య వరస సక్సెస్ ల తర్వాత రావడంతో ఈ మూవీ మీద మంచి క్రేజ్ అయితే ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఆశించిన స్థాయిలో బజ్ పెరగడం లేదు. అందుకే ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇప్పుడు చూస్తేనేమో సెన్సార్ ఏ ఇచ్చింది. రవితేజ రిస్క్ చేసి ఏదైనా ప్రయోగానికి సిద్ధపడినందు వల్లే ఇలా జరిగిందో ఏమో లెట్ వెయిట్ అండ్ సీ.

Satya

Recent Posts

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

26 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

53 minutes ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

56 minutes ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

1 hour ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

12 hours ago