ఇరవై రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా నాయుడుకు కాంప్లిమెంట్స్ కంటే ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగునాట ఫ్యామిలీ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని ఇలాంటి కంటెంట్ లో చూడటం పట్ల అధిక శాతం అభిమానులే అసంతృప్తిగా ఫీలయ్యారు.
ప్రమోషన్ల టైంలో ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని రానా నొక్కి చెప్పినప్పటికీ స్టార్ క్యాస్టింగ్ వల్ల చూడకుండా ఉండలేకపోయిన సగటు జనాలు లక్షల్లో ఉన్నారు. డబ్బింగ్ లోనూ బూతులు యథాతథంగా పెట్టేయడం విమర్శలకు కారణమయ్యింది. ఇవి దగ్గుబాటి బృందానికి చేరాయో లేక నెట్ ఫ్లిక్స్ స్వంతంగా పూనుకుందో తెలియదు కానీ హఠాత్తుగా రానా నాయుడుకి తెలుగు ఆడియో తీసేశారు.
ప్రస్తుతం ఒరిజినల్ హిందీ, తమిళం, మళయాలం, ఇంగ్లీష్ మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ లోనూ హిందీ ఇంగ్లీష్ తప్ప ఇంకే ఇతర భాషలు లేవు. తిరిగి ఫ్రెష్ గా అనువాదాన్ని సెన్సార్ చేయించి జోడిస్తారా లేక ఇక్కడితో తెలుగుకి మంగళం పాడేసి సర్దుకోమంటారానేది ఇంకొద్ది రోజులు వేచి చూశాక క్లారిటీ వస్తుంది. తెరవెనుక ఏం జరిగిందనేది పక్కనపెడితే రానా నాయుడుకి వచ్చిన స్పందన ఇతర స్టార్ హీరోలను జాగ్రత్త పడేలా చేసింది.
కొత్త ట్రెండ్, భారీ రెమ్యునరేషన్లు, కోట్లలో బడ్జెట్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అసలు స్క్రిప్ట్ ని పూర్తిగా శల్యపరీక్ష చేసుకోకపోతే ఏం జరుగుతుందో అర్థమయ్యింది. రానా నాయుడు సెకండ్ సీజన్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్రెడీ తీసేసారా లేక త్వరలో మొదలుపెడతారా అనేది సస్పెన్స్. ముందస్తు అగ్రిమెంట్ అయితే రెండు భాగాలనే రాసుకున్నారట. తీయాలా వద్దానేది ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ చేతుల్లోలోనే ఉంటుంది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…