ఇరవై రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా నాయుడుకు కాంప్లిమెంట్స్ కంటే ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగునాట ఫ్యామిలీ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని ఇలాంటి కంటెంట్ లో చూడటం పట్ల అధిక శాతం అభిమానులే అసంతృప్తిగా ఫీలయ్యారు.
ప్రమోషన్ల టైంలో ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని రానా నొక్కి చెప్పినప్పటికీ స్టార్ క్యాస్టింగ్ వల్ల చూడకుండా ఉండలేకపోయిన సగటు జనాలు లక్షల్లో ఉన్నారు. డబ్బింగ్ లోనూ బూతులు యథాతథంగా పెట్టేయడం విమర్శలకు కారణమయ్యింది. ఇవి దగ్గుబాటి బృందానికి చేరాయో లేక నెట్ ఫ్లిక్స్ స్వంతంగా పూనుకుందో తెలియదు కానీ హఠాత్తుగా రానా నాయుడుకి తెలుగు ఆడియో తీసేశారు.
ప్రస్తుతం ఒరిజినల్ హిందీ, తమిళం, మళయాలం, ఇంగ్లీష్ మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ లోనూ హిందీ ఇంగ్లీష్ తప్ప ఇంకే ఇతర భాషలు లేవు. తిరిగి ఫ్రెష్ గా అనువాదాన్ని సెన్సార్ చేయించి జోడిస్తారా లేక ఇక్కడితో తెలుగుకి మంగళం పాడేసి సర్దుకోమంటారానేది ఇంకొద్ది రోజులు వేచి చూశాక క్లారిటీ వస్తుంది. తెరవెనుక ఏం జరిగిందనేది పక్కనపెడితే రానా నాయుడుకి వచ్చిన స్పందన ఇతర స్టార్ హీరోలను జాగ్రత్త పడేలా చేసింది.
కొత్త ట్రెండ్, భారీ రెమ్యునరేషన్లు, కోట్లలో బడ్జెట్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అసలు స్క్రిప్ట్ ని పూర్తిగా శల్యపరీక్ష చేసుకోకపోతే ఏం జరుగుతుందో అర్థమయ్యింది. రానా నాయుడు సెకండ్ సీజన్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్రెడీ తీసేసారా లేక త్వరలో మొదలుపెడతారా అనేది సస్పెన్స్. ముందస్తు అగ్రిమెంట్ అయితే రెండు భాగాలనే రాసుకున్నారట. తీయాలా వద్దానేది ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ చేతుల్లోలోనే ఉంటుంది.
This post was last modified on March 30, 2023 10:37 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…