ఇది సోషల్ మీడియా కాలం. ఏదైనా కొత్త సినిమా పోస్టరో.. టీజరో రిలీజైతే జస్ట్ అలా చూసి ఓకే అనుకుని వదిలేయరు ఇప్పటి ప్రేక్షకులు. ప్రతిదాంట్లోనూ హిడెన్ డీటైల్స్ బయటికి తీసే ఒక పోస్టర్ మీద కూడా పెద్ద వ్యాసం రాసేంత కంటెంట్ ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన నాగశౌర్య కొత్త సినిమా పోస్టర్ను శోధించి ఓ ఆసక్తికర విషయం బయటికి తీశారు నెటిజన్లు.
ఈ ఫస్ట్ లుక్లో కండలు తిరిగిన దేహంతో నాగశౌర్య భలేగా కనిపించాడు. అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అంతా షాకయ్యారు. ఈ సినిమా ఓ ప్రాచీన యుద్ధ కళ నేపథ్యంలో సాగుతుందని చిత్ర బృందం వెల్లడించింది. కానీ శౌర్య లుక్ మాత్రం అందుకు చాలా మోడర్న్గా కనిపించింది. ఇక శౌర్య లుక్ గురించి నెటిజన్లు కనిపెట్టిన విషయం ఏంటంటే.. అతను రూ.11 వేలకు పైగా ఖరీదైన అండర్ వేర్ ధరించాడట.
జీన్స్ ప్యాంటు కింద అండర్ వేర్ బ్రాండ్ కనిపించేలా ఫస్ట్ లుక్ తయారు చేశారు. ఆ బ్రాండు.. ఫిలిప్ ప్లీన్. అత్యంత ఖరీదైన మెన్స్ ఇన్నర్ వేర్ బ్రాండు ఇది. దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్ను గుర్తు చేస్తూ.. ‘‘అంత ఖరీదెందుకు రా బుజ్జీ.. లోపలేమైనా ఏసీ ఉంటుందా’’ అంటూ ఒక మీమ్ తయారు చేయడం విశేషం.
ఇదిలా ఉంటే.. మన తెలుగు సినిమాల్లో హీరో ఎంత సామాన్యుడైనా సరే.. ఖరీదైన బ్రాండెడ్ బట్టలు వేయాల్సిందే అన్నది మరోసారి స్పష్టమైంది. మన ఫిలిం మేకర్లు పాత్రలు, వాటి లుక్స్ విషయంలో రియలిస్టిగ్గా ఉండరు అనడానికి దీన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ బ్రాండ్ ఇన్నర్ వేర్ వేయాలంటే హీరో మల్టీ మిలియనీర్గా కనిపించాలి. కానీ సినిమాలో హీరో పాత్ర సామాన్యుడిగా కనిపించేలా ఉంది. మరి ఆ పాత్ర ఇంత ఖరీదైన అండర్ వేర్ వేస్తే ఔచిత్యం దెబ్బ తింటుంది కదా. ఫస్ట్ లుక్ వరకు ఇలా అవసరం లేని ‘రిచ్నెస్’ చూపించినా.. సినిమాలో మాత్రం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సిందే.
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…