Movie News

నాగశౌర్య పోస్టర్‌ను శోధించి ఏం తేల్చారంటే..


ఇది సోషల్ మీడియా కాలం. ఏదైనా కొత్త సినిమా పోస్టరో.. టీజరో రిలీజైతే జస్ట్ అలా చూసి ఓకే అనుకుని వదిలేయరు ఇప్పటి ప్రేక్షకులు. ప్రతిదాంట్లోనూ హిడెన్ డీటైల్స్ బయటికి తీసే ఒక పోస్టర్ మీద కూడా పెద్ద వ్యాసం రాసేంత కంటెంట్ ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన నాగశౌర్య కొత్త సినిమా పోస్టర్‌ను శోధించి ఓ ఆసక్తికర విషయం బయటికి తీశారు నెటిజన్లు.

ఈ ఫస్ట్ లుక్‌లో కండలు తిరిగిన దేహంతో నాగశౌర్య భలేగా కనిపించాడు. అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అంతా షాకయ్యారు. ఈ సినిమా ఓ ప్రాచీన యుద్ధ కళ నేపథ్యంలో సాగుతుందని చిత్ర బృందం వెల్లడించింది. కానీ శౌర్య లుక్ మాత్రం అందుకు చాలా మోడర్న్‌గా కనిపించింది. ఇక శౌర్య లుక్ గురించి నెటిజన్లు కనిపెట్టిన విషయం ఏంటంటే.. అతను రూ.11 వేలకు పైగా ఖరీదైన అండర్ వేర్ ధరించాడట.

జీన్స్ ప్యాంటు కింద అండర్ వేర్ బ్రాండ్ కనిపించేలా ఫస్ట్ లుక్ తయారు చేశారు. ఆ బ్రాండు.. ఫిలిప్ ప్లీన్. అత్యంత ఖరీదైన మెన్స్ ఇన్నర్ వేర్ బ్రాండు ఇది. దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. ‘‘అంత ఖరీదెందుకు రా బుజ్జీ.. లోపలేమైనా ఏసీ ఉంటుందా’’ అంటూ ఒక మీమ్ తయారు చేయడం విశేషం.

ఇదిలా ఉంటే.. మన తెలుగు సినిమాల్లో హీరో ఎంత సామాన్యుడైనా సరే.. ఖరీదైన బ్రాండెడ్ బట్టలు వేయాల్సిందే అన్నది మరోసారి స్పష్టమైంది. మన ఫిలిం మేకర్లు పాత్రలు, వాటి లుక్స్ విషయంలో రియలిస్టిగ్గా ఉండరు అనడానికి దీన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ బ్రాండ్ ఇన్నర్ వేర్ వేయాలంటే హీరో మల్టీ మిలియనీర్‌గా కనిపించాలి. కానీ సినిమాలో హీరో పాత్ర సామాన్యుడిగా కనిపించేలా ఉంది. మరి ఆ పాత్ర ఇంత ఖరీదైన అండర్ వేర్ వేస్తే ఔచిత్యం దెబ్బ తింటుంది కదా. ఫస్ట్ లుక్ వరకు ఇలా అవసరం లేని ‘రిచ్నెస్’ చూపించినా.. సినిమాలో మాత్రం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సిందే.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago