టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ ఈ రోజు ఉదయం ఒక ట్వీట్ వేశాడు. తన ‘కందిరీగ’ సినిమాలో విలన్గా నటించిన సోనూ సూద్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వేసిన ట్వీట్ అది. బహుశా రామ్ ఇంత వరకు ఏ బాలీవుడ్ హీరోకైనా ఇలా విష్ చేశాడా అన్నది సందేహమే. అలాగే తనతో కలిసి నటించిన నటీనటులందరికీ కూడా ఇలా విష్ చేసే అలవాటు రామ్కు లేదు.
ఇలా తాను నటించిన ఓ సినిమాలో విలన్గా చేసిన నటుడికి గొప్ప ఎలివేషన్ ఇస్తూ అతను ట్వీట్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టి ఇప్పుడు సోనూ రేంజ్ ఏంటో అంచనా వేయొచ్చు. రామ్ విష్ ఓ ఉదాహరణ మాత్రమే. ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు సోనూను పొగుడుతూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మామూలు జనాల స్పందన అయితే మామూలుగా లేదు. ఒక పెద్ద సూపర్ స్టార్ రేంజిలో అతడిక ఎలివేషన్లు కనిపిస్తున్నాయి.
అతడి మీద ఎన్నో ఎడిట్లు.. ఒక్కోదాని వ్యవహారం చూస్తే సోనూ మీద ఇంత అభిమానమా అనిపిస్తుంది. ఇదేమీ సినిమాల ద్వారా వచ్చిన అభిమానం కాదు. లేదంటే హీరోల పీఆర్వోలు వెనుకండి నడిపిస్తున్న వ్యవహారమూ కాదు. కరోనా విలయం మొదలయ్యాక వలస కార్మికులు సహా ఎందరో అభాగ్యులను ఆదుకున్న సోనూ మీద నిజంగా వెల్లువెత్తిన అభిమాన ఫలితమిది.
ఓ ఫిలిం సెలబ్రెటీ నిజ జీవితంలో చేసిన మంచి పనులకు ఈ స్థాయిలో స్పందన రావడం.. జనాల్లో ఇంత అభిమానం వెల్లువెత్తడం అరుదైన విషయం. అతడి ఫాలోయింగ్, తన మీద కురుస్తున్న అభిమానం చూసి సూపర్ స్టార్లకు కూడా గుబులు పుడుతుందేమో. రూపాయి సాయం చేసి పది రూపాయల ప్రచారం పొందాలని చూసే అందరికీ.. ఏమీ ఆశించకుండా, చిత్తశుద్ధితో సాయం చేస్తే జనాల నుంచి నిజమైన అభిమానం ఎలా పొందవచ్చో చెప్పడానికి ఇది ఒక పాఠం అనడంలో సందేహం లేదు.
This post was last modified on July 30, 2020 4:13 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…