జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ ఇండియా సినిమా విషయంలో రాజీ మాటే లేకుండా చాలా బలమైన సాంకేతిక వర్గాన్ని సెట్ చేస్తున్నారు. బడ్జెట్ బయటికి చెప్పకపోయినా తారక్ కెరీర్ లోనే అత్యంత భారీగా రూపొందబోయే చిత్రం ఇదే అవుతుంది. ఆర్ఆర్ఆర్ ఉన్నప్పటికీ అది సోలో హీరోగా కాదు కాబట్టి పూర్తి పరిగణనలోకి రాదు.
తాజాగా బ్రాడ్ మిన్నిచ్ ని విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా తీసుకోవడం ఆయన గురించి తెలిసిన వాళ్లకు మంచి ఎలివేషన్ ఇస్తోంది. అవగాహన లేని ఫ్యాన్స్ కు ఈయన ఎవరబ్బా అనిపించొచ్చు కానీ కథ వేరే ఉంది. బ్రాడ్ మిన్నిచ్ సుప్రసిద్ధ హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు. ఈయన పనితనం గురించి తెలియాలంటే బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్, పోకెమోన్ డిటెక్టివ్ పికచు, ఆక్వామ్యాన్, 300 రైజ్ అఫ్ ది ఎంపైర్, ది ట్విలైట్ సాగా, ది గుడ్ లార్డ్ బర్డ్ టెలివిజన్ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది.
అయితే బ్రాడ్ కి ఇది ఫస్ట్ ఎంట్రీ కాదు. ప్రాజెక్ట్ కె కోసం దర్శకుడు నాగ అశ్విన్ ఆల్రెడీ ఇతనితో కలిసి పని చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీలో గ్రాఫిక్స్ ఎంత కీలక భాగం వహించనున్నాయో గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇపుడు ఎన్టీఆర్ కోసం తీసుకురావడం చూస్తే సెటప్ ఓ రేంజ్ లో ఉందని అర్థమైపోతుంది. ట్యాంకర్లలో కృత్రిమ రక్తం తీసుకురావడం, పోర్టు సెట్ ని అత్యంత భారీగా నిర్మించడం, క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొత్తానికి కొరటాల శివ కసి మాములుగా కనిపించడం లేదు. ఇంకో వారం రోజుల్లోపే రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్ గా జరగనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి చేసినప్పటికీ తన స్థాయి బ్రేక్ ఇంకా టాలీవుడ్ లో దక్కలేదు.
This post was last modified on March 28, 2023 4:56 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…