Movie News

NTR 30 – ఎవరీ బ్రాడ్ మిన్నిచ్

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ ఇండియా సినిమా విషయంలో రాజీ మాటే లేకుండా చాలా బలమైన సాంకేతిక వర్గాన్ని సెట్ చేస్తున్నారు. బడ్జెట్ బయటికి చెప్పకపోయినా తారక్ కెరీర్ లోనే అత్యంత భారీగా రూపొందబోయే చిత్రం ఇదే అవుతుంది. ఆర్ఆర్ఆర్ ఉన్నప్పటికీ అది సోలో హీరోగా కాదు కాబట్టి పూర్తి పరిగణనలోకి రాదు.

తాజాగా బ్రాడ్ మిన్నిచ్ ని విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా తీసుకోవడం ఆయన గురించి తెలిసిన వాళ్లకు మంచి ఎలివేషన్ ఇస్తోంది. అవగాహన లేని ఫ్యాన్స్ కు ఈయన ఎవరబ్బా అనిపించొచ్చు కానీ కథ వేరే ఉంది. బ్రాడ్ మిన్నిచ్ సుప్రసిద్ధ హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు. ఈయన పనితనం గురించి తెలియాలంటే బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్, పోకెమోన్ డిటెక్టివ్ పికచు, ఆక్వామ్యాన్, 300 రైజ్ అఫ్ ది ఎంపైర్, ది ట్విలైట్ సాగా, ది గుడ్ లార్డ్ బర్డ్ టెలివిజన్ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది.

అయితే బ్రాడ్ కి ఇది ఫస్ట్ ఎంట్రీ కాదు. ప్రాజెక్ట్ కె కోసం దర్శకుడు నాగ అశ్విన్ ఆల్రెడీ ఇతనితో కలిసి పని చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీలో గ్రాఫిక్స్ ఎంత కీలక భాగం వహించనున్నాయో గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇపుడు ఎన్టీఆర్ కోసం తీసుకురావడం చూస్తే సెటప్ ఓ రేంజ్ లో ఉందని అర్థమైపోతుంది. ట్యాంకర్లలో కృత్రిమ రక్తం తీసుకురావడం, పోర్టు సెట్ ని అత్యంత భారీగా నిర్మించడం, క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొత్తానికి కొరటాల శివ కసి మాములుగా కనిపించడం లేదు. ఇంకో వారం రోజుల్లోపే రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్ గా జరగనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి చేసినప్పటికీ తన స్థాయి బ్రేక్ ఇంకా టాలీవుడ్ లో దక్కలేదు.

This post was last modified on March 28, 2023 4:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago