Movie News

నాగ్ వెంకీ అంత రిస్క్ చేయగలరా?

ఇంకా తొమ్మిది నెలలు ఉండగానే 2024 సంక్రాంతి అప్పుడే వేడెక్కిపోతోంది. ఆలస్యం చేస్తే మంచి సీజన్ మిస్ అవుతుందనే ఉద్దేశంతో పెద్ద హీరోల సినిమాలన్నీ ముందుగానే కర్చీఫ్ వేసుకుంటున్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కె గతంలోనే జనవరి 12 తీసేసుకుంది. నిన్న మహేష్ బాబు త్రివిక్రమ్ కోసం 13ని బ్లాక్ చేశారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ డేట్ ఇవాళ సాయంత్రంలోపు తేలనుంది.

ఇది ఉంటే పోటీ ఇంకా రసవత్తరంగా మారుతుంది. లేదూ వేసవికి వెళ్తే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ ఇంకొంత కాలం పొడిగించాల్సి వస్తుంది. అయితే ట్విస్టులు ఇక్కడితో ఆగిపోలేదు. వెంకటేష్ దర్శకుడు శైలేష్ కొలను కాంబోలో రూపొందుతున్న సైంధవ్ ని జనవరి 14కి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో టీమ్ సీరియస్ గానే ఉందట.

రెగ్యులర్ షూటింగ్ ఈ వారంలోనే మొదలుపెట్టుకోబోతున్న ఈ మూవీ శైలేష్ రెగ్యులర్ బడ్జెట్ లకు భిన్నంగా భారీ ఖర్చుతో రూపొందుతోంది. అందుకే నవాజుద్దీన్ సిద్ధిక్ లాంటి టాప్ బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చారు. నిర్మాణానికి కనీసం ఏడు నెలల సమయం కోరడంతో పొంగల్ బరిలో దిగితే బాగుంటుందనే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇక నాగార్జున రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని డైరెక్టర్ గా లాంచ్ చేస్తున్న మూవీ తాలూకు రీమేక్ గొడవ దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని ఇన్ సైడ్ టాక్. దీని కోసం నాగ్ ఆల్రెడీ కొత్త లుక్ లోకి వెళ్లిపోయారు. దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మలయాళం హిట్ పొరింజు మరియం జొస్ మూల కథను తీసుకుని మన నేటివిటీకి అనుగుణంగా మార్చుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు లాంటి విలేజ్ డ్రామాలు సంక్రాంతికి వచ్చే మెప్పించాయి కాబట్టి కింగ్ కన్ను జనవరి మీదే ఉందట. మరి ఇంత రిస్క్ నిజంగా వెంకీ నాగ్ లు తీసుకుంటారా వెయిట్ అండ్ సీ.

This post was last modified on March 27, 2023 2:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago