అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15 టైటిల్ ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా బయటికి వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ కం యాక్షన్ డ్రామాకు గేమ్ చేంజర్ పేరుని లాక్ చేశారు. గత కొన్ని నెలలుగా దీని మీద చాలా ప్రచారాలే జరిగాయి.
సర్కారోడు, సిఈఓ, అధికారి, అప్పన్న ఇలా ఎన్నో బయటకు వచ్చాయి. కానీ అవేవి కాకుండా ఊహించనిది ఫిక్స్ చేయడం విశేషం. అన్ని భాషల్లోనూ ఇదే ఉండబోతోంది. మోషన్ పోస్టర్ వీడియోలో కేవలం థీమ్ ని మాత్రమే చూపించారు. శాసన సభ వ్యవస్థను నిర్దేశించే ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాన్నే చూచాయగా ఓపెన్ చేసి బ్యాక్ డ్రాప్ ఏంటనేది చెప్పారు.
అయితే గేమ్ ఛేంజర్ లాంటి ఇంగ్లీష్ టైటిల్ మాస్ కి ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. గతంలో లెజెండ్ లాంటివి వర్కౌట్ అయ్యాయి కానీ శంకర్ ఈసారి కొంచెం పొడవాటి పేరుని ఎంచుకోవడం అనూహ్యం. రామ్ చరణ్ లుక్ ని ఇవాళ మధ్యాన్నం విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. అంచనాల పరంగా గేమ్ చేంజర్ మీద మీద మాములు హైప్ లేదు.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో సహజంగానే చరణ్ తారక్ ల తర్వాత సినిమాల మీద ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. దానికి తగ్గట్టే శంకర్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం ఓ రేంజ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్ బలంగా ఉంది. ఏదైతేనేం మొత్తానికి సస్పెన్స్ కి తెరదించుతూ కొంచెం డిఫరెంట్ గా ఫ్యాన్స్ కి సరైన సమయంలో సరైన కానుకే ఇచ్చారు.
This post was last modified on March 27, 2023 9:21 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…