అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15 టైటిల్ ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా బయటికి వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ కం యాక్షన్ డ్రామాకు గేమ్ చేంజర్ పేరుని లాక్ చేశారు. గత కొన్ని నెలలుగా దీని మీద చాలా ప్రచారాలే జరిగాయి.
సర్కారోడు, సిఈఓ, అధికారి, అప్పన్న ఇలా ఎన్నో బయటకు వచ్చాయి. కానీ అవేవి కాకుండా ఊహించనిది ఫిక్స్ చేయడం విశేషం. అన్ని భాషల్లోనూ ఇదే ఉండబోతోంది. మోషన్ పోస్టర్ వీడియోలో కేవలం థీమ్ ని మాత్రమే చూపించారు. శాసన సభ వ్యవస్థను నిర్దేశించే ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాన్నే చూచాయగా ఓపెన్ చేసి బ్యాక్ డ్రాప్ ఏంటనేది చెప్పారు.
అయితే గేమ్ ఛేంజర్ లాంటి ఇంగ్లీష్ టైటిల్ మాస్ కి ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. గతంలో లెజెండ్ లాంటివి వర్కౌట్ అయ్యాయి కానీ శంకర్ ఈసారి కొంచెం పొడవాటి పేరుని ఎంచుకోవడం అనూహ్యం. రామ్ చరణ్ లుక్ ని ఇవాళ మధ్యాన్నం విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. అంచనాల పరంగా గేమ్ చేంజర్ మీద మీద మాములు హైప్ లేదు.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో సహజంగానే చరణ్ తారక్ ల తర్వాత సినిమాల మీద ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. దానికి తగ్గట్టే శంకర్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం ఓ రేంజ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్ బలంగా ఉంది. ఏదైతేనేం మొత్తానికి సస్పెన్స్ కి తెరదించుతూ కొంచెం డిఫరెంట్ గా ఫ్యాన్స్ కి సరైన సమయంలో సరైన కానుకే ఇచ్చారు.
This post was last modified on March 27, 2023 9:21 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…